సాయి ధరమ్ తేజ్ కోసం రష్మిక పై పెరుగుతున్న ఒత్తిడి !

Seetha Sailaja
‘గీత గోవిందం’ తరువాత రష్మిక క్రేజీ హీరోయిన్ గా మారిపోవడమే కాకుండా ఏకంగా ఆమెకు ఏర్పడిన క్రేజ్ తో టాప్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోయింది. ప్రస్తుత పరిస్థుతులలో ఆమె ఒప్పుకుంటే ఆమెకు పారితోషికంగా కోటి రూపాయలు పైగా ఇవ్వడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు. అయితే వచ్చిన సినిమాలు అన్నీ ఒప్పుకోకుండా చాల సెలక్టీవ్ గా సినిమాల విషయంలో వ్యవహరిస్తోంది రష్మిక. 

ముఖ్యంగా తన సినిమాలకు సంబంధించి హీరోల విషయంలో కూడ అందరితోను నటించే ఉద్దేశ్యం రష్మికకు లేదు. ఇలాంటి పరిస్థుతులలో అల్లు అరవింద్ నుండి ఈమెకు సాయి ధరమ్ తేజ్ విషయంలో ఊహించని ఒత్తిడి ఎదురౌతున్నట్లు సమాచారం. తెలుస్తున్న సమాచారం మేరకు ‘గీత గోవిందం’ నిర్మాణ సమయంలో అరవింద్ రష్మిక మరో రెండు సినిమాలు తన బ్యానర్ లో నటించే విధంగా ఎగ్రిమెంట్ చేసుకున్నట్లు టాక్. 

అయితే ‘గీత గోవిందం’ తరువాత ఆమె రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఇలాంటి పరిస్థుతులలో ఆమె గతంలో అరవింద్ కు ఇచ్చిన మాట తలనొప్పిగా మారినట్లు టాక్. ప్రస్తుతం చిరంజీవి సూచనతో సాయి ధరమ్ తేజ్ కెరియర్ చక్కదిద్దే ఏర్పాట్లలో భాగంగా మారుతి దర్శకత్వంలో అరవింద్ తేజ్ ను హీరోగా పెట్టి ఒక సినిమాను తీయబోతున్నాడు. 

ఇప్పటికే ఈమూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయింది అని సమాచారం. ఈమూవీలో హీరోయిన్ పాత్ర రష్మికతో నటింపచేయాలని అరవింద్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. అయితే ప్రస్తుతం పరాజయాల బాటలో కొనసాగుతున్న తేజ్ తో నటించడం ఇష్టం లేక ఈ సంవత్సరం అంతా తన డేట్స్ ఖాళీ లేవు అని చెపుతూ రష్మిక చెపుతున్నా అరవింద్ ఒత్తిడిని ప్రస్తుతం ఆమె తప్పించుకోలేక పోతోంది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: