మణిరత్నం దర్శకత్వంలో.. మోహన్ బాబా...? నిజమేనా..?

Chakravarthi Kalyan

మణిరత్నం.. మోహన్ బాబు.. ఈ రెండు పేర్లకూ పెద్దగా ఎక్కడా మేచింగ్ కలవదు. సాధారణంగా మోహన్ బాబు ఊర మాస్ సినిమాలు చేస్తుంటారు. మణిరత్నంది క్లాస్ బ్రాండ్.. కానీ వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోందని వార్తలు వస్తున్నాయి.



మణిరత్నం తన కొత్త సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మోహన్ బాబును సంప్రదించినట్టు ఫిల్మ్‌ నగర్ వర్గాలో టాక్ నడుస్తోంది. ప్రముఖ రచయిత తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన 'పొన్నియన్ సెల్వన్' అనే చారిత్రక నవల ఆధారంగా మణిరత్నం ఈ సినిమాను రూపొందించబోతున్నారట. దాదాపు వేయి సంవత్సరాల కిందటి మొదటి రాజరాజ చోళుని గాధను కథాంశంగా మణిరత్నం తీసుకున్నారని తెలుస్తోంది.



సాధారణంగా మణిరత్నం చారిత్రక కథల జోలికి వెళ్లరు. కానీ ఆయన త్వరలో ఈ ప్రయోగం చేయబోతున్నారట. ఆ సినిమాలో మోహన్ బాబుకు తగిన పాత్ర ఉందని.. ఆ పాత్ర మోహన్ బాబు చేస్తేనే బావుంటుందని మణిరత్నం ఫీలయ్యారట. అందుకే ఆయన్ను సంప్రదించారట.



మొన్నటివరకూ వరుస పరాజయాలతో నిరాశపరిచిన మణిరత్నం ఇటీవల నవాబ్ సినిమాతో మళ్లీ ట్రాక్‌లో పడిన విషయం తెలిసిందే. మల్టీస్టారర్ గా రూపొందిన ఈ చిత్రం మంచి వసూళ్లనే రాబట్టింది. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మణిరత్నం ఇప్పుడు తనదైన మార్కుతో కొత్త ప్రయోగం చేయబోతున్నారన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: