భయపెడుతూ నవ్విస్తున్న‘ప్రేమకథాచిత్రమ్ 2’ట్రైలర్!

Edari Rama Krishna

తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేష్ బాబు తర్వాత ఆయన అల్లుడు సుదీర్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చారు.  ఎస్ఎంఎస్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుదీర్ బాబు నటించిన చిత్రాల్లో చెప్పుకోదగ్గది మారుతి డైరెక్షన్ లో వచ్చిన ‘ప్రేమకథాచిత్రమ్’. ఈ చిత్రం హర్రర్, కామెడీ నేపథ్యంలో రావడంతో మంచి విజయం అందుకుంది.  ఈ చిత్రంలో సుదీర్ బాబు సరసన నందిత రాజ్ నటించింది.  దాంతో ఆ సినిమాకి సీక్వెల్ గా 'ప్రేమకథా చిత్రమ్ 2' రూపొందింది. 


హరికృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్ ,నందిత శ్వేత, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ నుంచి టీజర్ వరకు మంచి స్పందన వచ్చింది.  తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. హారర్ కామెడీ సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ భయపెడుతూనే నవ్విస్తుంది.


'సంథింగ్ ఈజ్ రాంగ్ .. అదేంటో తెలుసుకోవాలి' అనే హీరో డైలాగ్ .. 'ఏం జరుగుతుందో అర్థం కావడం లేదా?' అనే నందిత శ్వేత డైలాగ్స్ తో ఆసక్తి రేపుతున్నాయి. మొత్తానికి ఈ చిత్రం కూడా  'ప్రేమకథా చిత్రమ్' లాగే మంచి హిట్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: