అంగరంగ వైభవంగా వెంకటేష్ కూతురు అశ్రిత వివాహం!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీ ఫ్యామిలీ హీరో విక్ట రీ వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.  రాజస్థాన్ లోని ప్రముఖ టూరిస్ట్ స్పాట్ గా పేరుగాంచిన జైపూర్ లోని ఓ స్టార్ హోటల్ ఈ సెలబ్రిటీ మ్యారేజికి వేదికగా నిలిచింది.  ఈ వేడుకకు టాలీవుడ్,బాలీవుడ్‌ సహా పలువురు సినీ,రాజకీయ రంగ ప్రముఖులు హాజరై నూతన దంపుతలును ఆశీర్వదించారు. ఈ పెళ్లి వేడుకను వెంకటేష్ ఎంతో అట్టహాసంగా నిర్వహించాడు. ఈ పెళ్లికి మూడ్రోజుల ముందు నుంచే జైపూర్ తారాతోరణంతో కళకళలాడింది.

బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, బీనాకాక్ తదితరులు విచ్చేయగా, టాలీవుడ్ నుంచి రానా దగ్గుబాటి, అక్కినేని నాగచైతన్య-సమంత హాజరైన విషయం తెలిసిందే.  శుక్రవారం రాత్రి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించగా, శనివారం సంగీత్ కార్యక్రమంలో ఆడిపాడారు.  కాగా, హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు, మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్రాణ స్నేహితుడు, ర‌ఘురామి రెడ్డి త‌న‌యుడు వినాయక్ రెడ్డితో వెంకీ కూతురు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. 


కొన్ని రోజులుగా వినాయ‌క్, అశ్రిత ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమను పెద్దలు ఆశీర్వదించి వివాహాన్ని జరిపించారు. ఈ పెళ్లి ఏర్పాట్లను రానా దగ్గుబాటి దగ్గరుండి పర్యవేక్షించారు. ఆ మ‌ధ్య రాజ‌మౌళి కొడుకు పెళ్లి కూడా రాజ‌స్థాన్ లోనే జ‌రిగింది. ఇప్పుడు వెంకీ కూతురు పెళ్లి కూడా అక్క‌డే జ‌రుగింది. ఇప్ప‌టికే ద‌గ్గుపాటి కుటుంబంతో పాటు అక్కినేని కుటుంబం ఈ పెళ్లిలో  సంద‌డి చేసారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: