భీమవరం లో పవన్ కళ్యాణ్ కి భారీ దెబ్బ కొట్టబోతున్న ప్రభాస్ అభిమానులు..!

KSK
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం అంతట అలుముకుంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మొట్టమొదటి సారి ఎన్నికలలో పోటీ చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా ఓడిపోతాడ అనే ప్రశ్నలు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరియు పొలిటికల్ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఆయన పోటీ చేస్తున్న పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో తన అన్న చిరంజీవి ఓడిపోయిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదా అన్న విషయం పై బెట్టింగులు బీభత్సంగా జరుగుతున్నట్లు సమాచారం.


ఇదిలా ఉండగా భీమవరం నియోజకవర్గం లో పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి ప్రముఖ హీరో ప్రభాస్ అభిమానులు వ్యవస్థలో కృషి చేస్తున్నట్లు కష్టపడుతున్నట్లు పశ్చిమగోదావరి జిల్లా లో టాక్ వినపడుతుంది. మొదట్లో ప్రభాస్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్‌కి మద్దతుగా నిలవాలనే ప్రతిపాదనను సమర్ధించారట. అయితే రఘురాం కృష్ణం రాజు వైసీపీలో చేరడం.. అక్కడ రాజుల ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండటంతో సమీకరణాలు పూర్తిగా మారినట్లు తెలుస్తోంది.


మొదట్లో పవన్ కళ్యాణ్‌కి పోటీ చేయాలనుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు వైసీపీకి మద్దతు ప్రకటించారట. భీమవరంలో ప్రభాస్‌కి ఫ్యాన్స్ ఎక్కువగానే ఉండటంతో ఆ ప్రభావం ఎంత వరకూ పనిచేస్తుందో చూడాలి. ఇక ప్రభాస్ పెదనాన్న క్రిష్ణంరాజు బీజేపీలోనే కొనసాగుతుండగానే.. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం వైసీపీ మద్దతు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిరేకెత్తిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: