‘మజిలీ’సెన్సార్ పూర్తి!

siri Madhukar
టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటీఫుల్ జంట ఎవరంటే వెంటనే చెబుతారు..చైతూ, సమంత.  ‘ఏం మాయ చేసావే’ సినిమాతో పరిచయం అయిన ఈ జంట ఆటోనగర్ సూర్య, మనం సినిమాలతో ఈ బంధం పెళ్లి వరకు వెళ్లింది.  గత ఏడాది పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.  మూడు నెలల విరామం తర్వాత ఈ జంట మళ్లీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు.  సమంత నటించిన మహానటి, రంగస్థలం, అభిమన్యుడు సూపర్ హిట్ గా నిలిచారు.  తెలుగు, తమిళ భాషల్లో సమంత విరామం లేకుండా నటిస్తున్నారు. 

నాగ చైతన్య నటించిన సవ్యసాచి, శైలజారెడ్డి అల్లుడు సినిమాలు రెండూ నిరాశ పరిచాయి.  అయితే పెళ్లయిన తర్వాత ఈ జంట మొదటిసారిగా ‘మజిలీ’సినిమాలో నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో నాగ చైతన్య క్రికెటర్ గా కనిపిస్తున్నాడు.  తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ను మంజూరు చేశారు. 

ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాగా, చైతూ, సమంత పెళ్లి తరువాత వస్తోన్న తొలి సినిమా కావడంతో, ఈ సినిమా తప్పకుండా హిట్ కావాలని ఈ జంట కోరుకుంటోంది.  అంతే కాదు తిరుమల వేంకటేశ్వర స్వామిని కాలినడకన వెళ్లి దర్శించుకుంది సమంత. ప్రేమ .. పెళ్లి .. ఆశయం అనే మూడు బలమైన కోణాల్లో ఈ సినిమా కథ కొనసాగుతుంది. ఈ సినిమా  ఏ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: