తెలుగు ఇండస్ట్రీలో నాగార్జున కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్పటికీ ఆయన కుర్ర హీరోలానే కనిపిస్తుంటారని అందరూ అంటారు..అందుకే నాగ్ ని మన్మధుడు అని పిలుస్తారు. 2016 లో సంక్రాంతి కానుకగా కళ్యాన్ కృష్ణ దర్శకత్వంలో ‘సోగ్గాడే చిన్ని నాయన’చిత్రం బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ చిత్రం సీక్వెల్ చేయాలని అప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నా అది వాయిదా పడుతూ వస్తుంది. ఈ చిత్రంలో నాగార్జున ద్విపాత్రాభినయంలో ఒకటైన బంగార్రాజు పాత్రకు ఎంతో పేరు వచ్చింది. దాంతో అదే టైటిల్ తో సీక్వెల్ చేయాలనే నిర్ణయానికి నాగార్జున.
ఆయన ప్రయత్నం ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది. నాగార్జున తన సొంత బ్యానర్లో ఈ సినిమాను లాంచ్ చేసే ఆలోచనలో వున్నారు. కాకపోతే ఇప్పుడు ఎన్నికల సీజన్ కావడంతో ఆ చిత్రం ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో నాగ్ సరసన ఆ మద్య రమ్యకృష్ణ నటిస్తుందని వార్తలు వచ్చాయి.
కానీ తాజాగా సమాచారం మేరకు నయనతార అయితే బాగుంటుందని భావించిన కల్యాణ్ కృష్ణ .. తాజాగా ఆమెతో సంప్రదింపులు జరిపినట్టుగా సమాచారం. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. నాగ్, నయన్ కాంబినేషన్ లో బాస్, గ్రీకు వీరుడు చిత్రాలు వచ్చాయి. మరి ఈ బంగార్రాజు ఏ రేంజ్ లోమెప్పిస్తాడో చూడాలి.