వారిద్దరిని ఇంటికి పిలిచి భోజనం పెట్టిన నాగార్జున..!
అందుకే ఇప్పుడు 'మజిలి' సక్సెస్ ను నాగ్ ఓ రేంజులో సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఇటీవల సమంత అండ్ చైతన్యను ఇంటికి పిలిచి డిన్నర్ చేసిన నాగ్, త్వరలోనే ఈ సినిమా యునిట్ కు గ్రాండ్ పార్టీ ఇస్తున్నాడట. అంటే తన కరువును తీర్చేసిన ఈ సినిమా యునిట్ ను ఎంత గౌరవించినా కూడా తక్కువే అని ఆయన ఫీలయ్యాడట.
మొత్తం మీద అక్కినేని ఫ్యామిలీ కి తాజాగా వచ్చిన మజిలీ సినిమా హిట్టు చాలా సంతోషాన్ని ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇదే క్రమంలో గతంలో మన్మధుడు వంటి సినిమా తో మెరిపించిన నాగార్జున సినిమా కొనసాగింపుగా చేస్తున్న మన్మధుడు పార్ట్2 కూడా హిట్ కొడితే బాగుంటుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అక్కినేని అభిమానులు.