మెగా మేనళ్లుడు సాయిధరమ్తేజ్ కెరీర్ స్టార్టింగ్లో హ్యాట్రిక్ హిట్లు కొట్టినా తర్వాత ఆరు వరుస ప్లాపులతో డిజాస్టర్స్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాయి నుంచి సినిమా వస్తుందంటే బయ్యర్లే కాదు ప్రేక్షకులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. తాజాగా సాయి నటించిన సినిమా చిత్రలహరి. ఈ సినిమాకు మామూలుగా అయితే బిజినెస్ జరగడం కష్టమే.
ఈ సినిమాను నిర్మించింది మైత్రీ మూవీ మేకర్స్ వారు కావడంతో వీళ్లు చాలా తెలివిగా బిజినెస్ చేసేసినట్టు తెలుస్తోంది. చిత్రలహరి ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల రూపాయల థియేట్రికల్ రైట్స్ అమ్మగలిగారు. ఏపీ, నైజాంలో అటు ఇటుగా 10 కోట్ల రూపాయలకు ఈ సినిమా రైట్స్ అమ్ముడుపోయాయి. ఏరియా వైజ్గా ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ ఇలా ఉంది. ప్రస్తుతం థియేటర్లలో నాగచైతన్య మజిలీ సినిమా మినహా మరే చెప్పుకోదగ్గ సినిమా లేదు. సోలోగా వస్తోన్న మెగా మేనళ్లుడు ఆరు వరుస ప్లాపుల తర్వాత అయినా హిట్ కొడతాడేమో ? చూడాలి.
చిత్రలహరి ఏరియా వైజ్ ప్రి రిలీజ్ బిజినెస్ : ( రూ.కోట్లలో)
నైజాం – 3
సీడెడ్ – 1.80
ఉత్తరాంధ్ర- 1.32
ఈస్ట్ – 0.96
వెస్ట్ – 0.84
గుంటూరు – 1.10
నెల్లూరు – 0.48
కృష్ణా – 0.90