షాకింగ్ మహేష్ కు దక్కని అవెంజర్స్ !

Seetha Sailaja
సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక సినిమా చూడాలి అనుకుంటే అతడి కోసం ఆ సినిమా నిర్మాతలు స్పెషల్ షోలను వేస్తారు. అయితే మహేష్ ధియేటర్ కూర్చుని సినిమా చూడాలి అని కోరుకున్నా అతడికి ఆసినిమా టిక్కెట్లు తన సొంత సినిమా ధియేటర్ లోనే దొరకని విషయాన్ని మహేష్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. 

ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ మూవీని మొదటిరోజు మహేష్ తన పిల్లలతో సాయంత్రం 7 గంటల షోకు చూడాలని అనుకున్నాడట. దీనికోసం మహేష్ తన సొంత ధియేటర్ అయిన ఎఎంబీ మాల్ మేనేజర్ కు మహేష్ వ్యక్తిగత సిబ్బంది ఫోన్ చేసి టిక్కెట్లు అడిగితే ఒక్క టిక్కెట్ కూడ తన వద్ద లేదు అని తన ధియేటర్ మేనేజర్ చెప్పిన విషయం తెలుసుకుని తాను షాక్ అయిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. 

మహేశ్ సునీల్ నారంగ్ తో కలిసి ఎఎంబీ మాల్ హైదరాబాద్ లో నిర్మించిన తరువాత ఆ ధియేటర్లు ఫైవ్ స్టార్ హోటల్ ను తలపించేలా ఉండటంతో ఆ ధియేటర్ టిక్కెట్లు దొరకడమే చాల కష్టంగా మారుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆ ధియేటర్ లోని సౌండ్ సిస్టమ్ అత్యుత్తంగా ఉండటంతో చాలామంది ఆ ధియేటర్లలో సినిమాను చూడటానికి ఇష్టపడుతున్నారు. 

అలాంటి ధియేటర్లు హైదరాబాద్ లో కట్టాలి అన్న కల తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణది అనీ తన తండ్రి కలలు సాకారం చేసినందుకు తనకు ఎంతో గర్వంగా ఉంది అని కామెంట్ చేసాడు మహేష్. అంతేకాదు అన్నీ అనుకూలిస్తే ఇలాంటి స్థాయిలో విజయవాడలో కూడ ధియేటర్ నిర్మాణం చేయాలని తన కోరిక అంటూ మహేష్ తన భవిష్యత్ ప్రణాకల గురించి కూడ లీకులు ఇస్తున్నాడు..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: