'సాహో' సినిమా రీషూట్ ఫైర్ అయిన ప్రభాస్..?
గతంలో ఈ సినిమా మొదలు పెట్టిన సమయంలో సినిమాకి సంబంధించిన ఒక వార్త కూడా ఎడిట్ చేయని సినిమా యూనిట్ పై ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అయిన సందర్భంలో..సినిమాకి సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ మరియు వీడియోను విడుదల చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన ఒక వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.
అసలు విషయానికొస్తే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాల విషయంలో సినిమా యూనిట్ సంతృప్తిగా లేరని దీంతో ఆ సన్నివేశాలను రీషూట్ చేయాలని ప్రభాస్ ని కోరారట. దీంతో ప్రభాస్ సినిమా యూనిట్ పై ఫైర్ అయినట్లు ఇండస్ట్రీలో టాక్ వినపడుతోంది.