అల్లు అర్జున్ కోసం అడవులను వెతుకుతున్న సుకుమార్..?

KSK
రంగస్థలం వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేష్ బాబు తో సినిమా చేయాలని అనుకున్నాడు సుకుమార్. అయితే కొన్ని అనివార్య కారణాల వలన సుకుమార్ తో సినిమా ఆగిపోయిందని సుకుమార్ ఎనౌన్స్ చేయకముందే మహేష్ బాబు ప్రకటించి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. అయితే ఈ విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ మరియు సోషల్ మీడియాలో సంచలనం బాగా వెంటనే మహేష్ బాబు కలుగజేసుకుని సుకుమార్ తో చేయబోయే సినిమా స్టోరీ విషయంలో కొద్దిగా తేడా వచ్చి సినిమా ఆపేశాను కానీ భవిష్యత్తులో కచ్చితంగా సుకుమార్ తో సినిమా చేస్తానని ఇటీవల మహర్షి సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో తెలిపారు.


దీంతో సుకుమార్ తో మహేష్  సినిమా లేదని ప్రకటించగానే... సుకుమార్ వెంటనే అల్లు అర్జున్ తో సినిమా తీస్తున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తో తీయబోయే సినిమా ఎర్ర చందనానికి సంబంధించిన స్మగ్లింగ్ కథ తో కూడుకున్న సినిమా అని దీంతో ఈ సినిమాని త్వరలోనే అనగా మే 11 వ తారీకున అధికారికంగా సినిమా ని ప్రారంభించి రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నెలలో చేయాలనే ఆలోచనలో ఉన్నారట సుకుమార్.


అంతేకాకుండా ఎర్రచందనం స్మగ్లింగ్ కు సంబంధించిన స్టోరీ అయిన నేపథ్యంలో అల్లు అర్జున్ కోసం తిరుమల అడవుల్లో అలాగే ముదుమలై అడవులలో లొకేషన్ వెతికే పనిలో పడ్డారట డైరెక్టర్ సుకుమార్. అంతేకాకుండా ఈ సినిమాని సెప్టెంబర్ నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి వచ్చే వేసవికి విడుదల చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: