ప్రభాస్ సాహో మీద వైరల్ అవుతున్న న్యూస్ ఇదే !
ఇదిలావుండగా తాజాగా ఈ సినిమా గురించి ఒక అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ సినిమాకి పని చేస్తున్న యాక్షన్ స్టంట్ డైరెక్టర్ కెన్నీ బీట్స్ కొన్ని ఆసక్తికర అంశాలను బయటపెట్టినట్టు తెలుస్తుంది.ఈ సినిమా ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పై ఏ సినిమా కూడా చూడని విధంగా ఉండబోతుందని.అంతే కాకుండా ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకు వచ్చిన రాబోయే సినిమాలు ఈ సినిమా యాక్షన్ రేంజ్ ను అందుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందని తెలియజేసారు.
దీనికి కారణం అన్ని ఇండస్ట్రీలకు చెందిన యాక్షన్ డైరెక్టర్స్ కలయిక వల్ల జరిగింది మాత్రం అయితే కాదని ఇది పూర్తిగా దర్శకుడు సుజీత్ యొక్క విజన్ అని తెలిపారు.మరి బయటకు వచ్చిన ఈ వార్తల్లో ఎంత వాస్తవం ఉందో తెలియదు గాని ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానుల మధ్య పెద్ద హాట్ టాపిక్ అయింది.