కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో ధోని సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామా టాలీవుడ్ కు ఆ సినిమాతోనే పరిచయం అయ్యింది. ఈ సినిమాకు మంచి పేరు రావడంతో తరువాత తెలుగులో మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమాలో నటించి మెప్పించింది. అది సూపర్ హిట్. ఆ వెంటనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. బోయపాటి కాంబినేషన్లో వచ్చిన వినయ విధేయ రామ సినిమాలో నటించింది. హైవోల్టేజ్ యాక్షన్ సినిమాగా వచ్చిన ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
దీంతో పాటు బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లో హీరోయిన్ గా చేస్తున్నది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. అలాగే యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టింది. ఇందులో భాగంగా కియారా అద్వానీ ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి చెప్పింది.
కబీర్ సింగ్ సినిమా గురించే కాకుండా... ఆమె నటించిన బోల్డ్ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పింది. లస్ట్ స్టోరీస్ లో ఆర్గాజం గురించిన సీన్స్ ఉన్నాయి. అందులో కియారా అద్భుతంగా నటించింది. ఈ సీన్ గురించి కియారాను అడిగితె...
స్వయంతృప్తి సీన్ చేసే ముందు ఆ సీన్ గురించి ఇంట్లో అందరికి చెప్పి వాళ్ళను మానసికంగా సిద్ధం చేశానని, ఒక్క అమ్మమ్మకు తప్పా అందరికి చెప్పినట్టు చెప్పింది. తన అమ్మమ్మతో కలిసి ఆ సీన్ చూసిన తరువాత, నటనలో భాగమే కదా బాగా చేశావని అమ్మమ్మ మెచ్చుకుందని చెప్పింది కియారా. నెట్ ఫ్లిక్స్ లో నాలుగు భాగాలుగా ఈ సీరీస్ ప్రసారం జరిగింది.