టాలీవుడ్ లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘మహర్షి’సినిమా మంచి సక్సెస్ సాధించి బాక్సాఫీస్ షేక్ చేస్తుంది. వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా పతాకాలపై రూపొందిన భారీ మూవీ ‘మహర్షి’. సూపర్స్టార్ మహేష్కు ఇది 25వ మూవీ. ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మహర్షి సినిమాపై వస్తున్న టాక్ చూస్తే నాకు చాలా గర్వంగా ఉందన్నారు.
వైజయంతి బ్యానర్, దిల్ రాజు బ్యానర్, పివిపి బ్యానర్. ముగ్గురు కలిసి నా 25 సినిమాను ప్రొడ్యూస్ చేయడం, అలానే దత్ గారు నన్ను ఇంట్రడ్యూస్ చేసి.. నా 25వ సినిమా కూడా నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. విజయవాడ వచ్చి ఆ కనకదుర్గ ఆశీస్సులు తీసుకొని ఇక్కడ ఫంక్షన్ చేస్తే ఆ ఫీలింగే వేరు అన్నారు. నా సినిమాలు బ్లాక్ బస్టర్ అయినప్పుడల్లా ఆ తల్లే నన్ను ఇక్కడికి పిలుస్తది.
ముందుగా మామయ్య రాఘవేంద్రరావుగారికి థ్యాంక్స్. ఎందుకంటే ఆయనతో సినిమా చేసినప్పుడు నన్ను ఒక ఫ్రెండ్లా చూసుకున్నారు.నువ్వు పెద్ద సూపర్ స్టార్వి అవుతావు అని చెప్పారు. నా 25వ సినిమా అన్ని బ్లాక్బస్టర్స్నీ ఒక వారంలో దాటించారు..ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షదేవుళ్లకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను..మీకు చేతులెత్తి దండం పెట్టడం తప్ప..అంటూ ఎమోషన్ కి గురయ్యారు.