సైకిల్ టైర్ కి పంచర్ పడింది అంటున్న రాంగోపాల్ వర్మ..!
ఇదే విషయమై ఇటీవల విజయవాడకు వచ్చి ఏ సమయంలో అప్పట్లో మీడియా సమావేశం పెడతానని ప్రకటించారో అదే ప్లేస్ లో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు ప్రభుత్వం పై చాటింగ్ కామెంట్లు చేశారు. ప్రెస్ మీట్ లో రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ.. సినిమా లెట్ అవ్వడానికి కారణం.. సైకిల్ చాలా జోరుగా తిరుగుతోంది కాబట్టి పంక్చర్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సి వచ్చిందని చెబుతూ ఇప్పుడు మాత్రం థియేటర్ లో ఏపీ ప్రజలకు నిజాన్ని చూపించబోతున్నట్లు చెప్పారు.
ఇది నచ్చక చాల మంది సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేశారు.ఇక ఈ కథను తెరపై చూపించడానికి ప్రధాన కారణం.. 25 ఏళ్ల తరువాత కూడా ఎన్టీఆర్ ఫోటో పెట్టుకొని ఓట్లడుగుతున్నారు. అది మెయిన్ గా తెరమీద చూపించాలని అనుకున్నానని వర్మ సమాధానం ఇచ్చారు. అనంతరం పాలిటిక్స్ గురించి తనకు ఎక్కువ తెలియదని ఎవరి గురించి కామెంట్ చేయనని వర్మ మాట్లాడారు.