టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి ఎలాంటి హిట్ కొట్టిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ పేరు మారుమ్రోగి పోయింది. ఒక్క విజయ్ పేరు మాత్రమే కాదు.. అటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పేరు కూడా మారుమ్రోగిపోయింది. వెంటనే సందీప్ కు బాలీవుడ్ నుంచి పిలుపు రావడం.. బాలీవుడ్ కు వెళ్లిపోవడం జరిగిపోయాయి.
షాహిద్ కపూర్ తో బాలీవుడ్ లో కబీర్ సింగ్ చేశాడు. ఈ సినిమా జూన్ 21 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. సినిమాపై ఇప్పటికే పాజిటివ్ టాక్ క్రియేట్ అయ్యింది. ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో కూడా భారీగా జరిగినట్టు తెలుస్తోంది. కబీర్ సింగ్ పై సంతృప్తిని వ్యక్తం చేసిన షాహిద్ కపూర్.. సందీప్ కు మరో అఫర్ ఇచ్చాడు.
తనకోసం మరో స్క్రిప్ట్ ను రెడీ చేసుకోవాలని.. తప్పకుండా కాంబినేషన్లో మరో సినిమా చేయాలని కోరాడట. దీనికి సందీప్ కూడా ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. సందీప్ కు టాలీవుడ్ లో ఆఫర్లు వస్తున్నాయి కానీ, అనుకున్నట్టుగా స్టార్ హీరోలతో సినిమా అవకాశాలు దొరకడం లేదు.
ఇప్పుడు టాప్ హీరోలంతా బిజీ అయ్యారు. ఈ టైమ్ లో వాళ్ళ కోసం వెయిట్ చేయడం కంటే... బాలీవుడ్ లో మరో సినిమా చేస్తే బాగుంటుంది కదా అనుకున్నాడేమో.. ఇదే జరిగితే.. సందీప్ బాలీవుడ్ లో షాహిద్ తో సినిమా చేయడం గ్యారెంటీ అవుతుంది.