బెంగుళూరులో ఏ సౌత్ హీరో సృష్టించని రికార్డులు సృష్టిస్తున్న మహేష్ బాబు…!
ఈ క్రమంలో మహేష్ బాబు అభిమానులు సినిమా సూపర్ డూపర్...బ్లాక్ బస్టర్ కావడంతో బీభత్సమైన ఆనందంలో మునిగి తేలుతున్నారు. ముఖ్యంగా బెంగళూరు నగరంలో ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూస్తుంటే అందరికీ మతి పోతుంది. అక్కడ బెంగళూర్ సిటీ మీనాక్షి థియేటర్లో ఇప్పటి వరకు సూపర్ స్టార్ రజిని నటించిన “పేట” చిత్రం 35 లక్షల నెట్ గ్రాస్ వసూలు చేయగా 'మహర్షి' మాత్రం కేవలం నాలుగు వారాల్లోనే 34 లక్షల 79 వేలు వసూలు చేసి అక్కడ పేట రికార్డును తుడిచేసే నెంబర్ 1 సౌత్ ఇండియన్ గ్రాసర్ గా నిలవనుంది అని తెలుస్తుంది.
ఇదొక్కటే కాకుండా బెంగళూరు సిటీ సహా అక్కడ మొత్తం లాంగ్ రన్ లో దాదాపు 6 కోట్లు వసూలు చేయబోయే ఏకైక భారతీయ సినిమాగా మహర్షి మరో రికార్డు నమోదు చేసేందుకు అవకాశం ఉందని కూడా ట్రేడ్ పండితులు చెప్తున్నారు. మొత్తంమీద బెంగళూరు నగరంలో ఏ సౌత్ హీరో సృష్టించని రికార్డులు సృష్టిస్తున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అని అంటున్నారు సౌత్ ఇండస్ట్రీ కి చెందినవారు.