తెలుగు చిత్ర పరిశ్రమలో డెరీంగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. పూరి దర్శకత్వంలో ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం వేగంగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటుంది. త్వరలో ఆడియో పంక్షన్ కూడా నిర్వహించనున్నారు. ఈ సమయంలో ఇస్మార్ట్ శంకర్ విడుదల వాయిదా పడింది. ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ కారణంగా ఈ చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.
చిత్రయూనిట్ మాత్రం ఇస్మార్ట్గా ఆలోచించింది. ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదని.. ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఇది కరెక్ట్ సీజన్ కాదనుకొని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్తో సినిమాపై హైప్ పెంచేసిన యూనిట్.. ఈ చిత్రాన్ని జూలై 12న విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించింది. వరల్డ్ కప్ క్రికెట్ ఫీవర్ బీభత్సంగా ఉండటంతో జనాలు పెద్దగా థియేటర్స్కి రారు. కాబట్టి వరల్డ్ కప్ ఫైనల్స్ ఇంపాక్ట్ చిత్రంపై పడే అవకాశం ఉంది. కాబట్టి చిత్రబృందం ఛాన్స్ తీసుకునేందుకు సాహసించట్లేదు.
ప్రస్తుతం వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తున్న నేపథ్యంలో ఈచిత్రాన్ని వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఫైనల్ మ్యాచ్ 14న జరుగుతుండటంతో.. ఆ తరువాతే రిలీజ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో జూలై 18న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మిలు సంయుక్తంగా ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.