చిరంజీవి- కొరటాల సినిమాకు దూరమైపోయిన దేవి శ్రీ ప్రసాద్..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో మిర్చి సినిమాతో కెరీర్ ప్రారంభించిన డైరెక్టర్ కొరటాల శివ ఆ సినిమాతోనే దేవిశ్రీప్రసాద్ పరిచయం మరియు ప్రయాణం స్టార్ట్ చేశాడు. ఆ సినిమా స్టోరీ పరంగా లో మ్యూజికల్ గాను సూపర్ డూపర్ హిట్టవడంతో వెంటనే తాను దర్శకత్వం వహించిన శ్రీమంతుడు జనతాగ్యారేజ్ భరత్ అనే నేను సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ అనే ఎంపిక చేసుకుని అద్భుతమైన విజయాలు సాధించి ఇండస్ట్రీలో పరాజయం లేని దర్శకుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు.
అయితే తాజాగా మాత్రం చిరంజీవి తో చేయబోయే సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ అని కొరటాల శివ పక్కన పెట్టినట్లు ఫిలింనగర్ టాక్. ఎందుకంటే సైరా సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేదికి మెగాస్టార్ మరో అవకాశం ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ఫిదా అయిన చిరు నెక్స్ట్ కొరటాల శివ తో చేయబోయే సినిమాకు కూడా ట్యూన్స్ చేయాలనీ అఫర్ ఇచ్చేశాడు. దీంతో కోరటాల దేవిశ్రీప్రసాద్ కాంబో కి మొదటిసారి బ్రేక్ పడినట్టే అని అర్థమవుతోంది.