ఆ విషయంపై జక్కన్న క్లారిటీ ఇచ్చాడు!

Edari Rama Krishna
నేటి నుంచి అమెరికాలో తానా మహాసభలు జరుగుతున్న విషయం తెలిసిందే.  అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఈ నెల 4, 5, 6 తేదీల్లో తానా 22వ మహాసభలు జరగనున్నాయి.   ఈ కార్యక్రమానికి సాధారణంగా సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కావడం చూస్తుంటాం.  తాజాగా దర్శకధీరుడు రాజమౌళి తానా మహాసభలకు విచ్చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

సంగీత దర్శకుడు కీరవాణి స్పెషల్ మ్యూజిక్ షో కూడా వేడుకలో భాగం కానుంది. అయితే తానా మహాసభలో రాజమౌళి పాల్గొనబోతున్నారన్న వార్తలు రావడంతో..ప్రస్తుతం తాను వ్యక్తిగత పనిపై వాషింగ్టన్ డీసీకి వచ్చానని తెలిపారు. తానా సభలకు తాను వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చారు. 

 ‘ఫ్రెండ్స్.. పెద్దన్న(ఎం.ఎం.కీరవాణి) మ్యూజిక్ షోకు నేను హాజరుకాకపోవచ్చు. నేను వస్తానని అనుకుని ఎవ్వరూ బాధపడటం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ వివరణ ఇస్తున్నా’ అని రాజమౌళి ట్వీట్ చేశారు.
Friends, I have come to Washington on a personal work. Not for TANA convention. I might not even attend peddanna's musical show. I do not want people to expect me at the convention and get disappointed. Hence the clarificarion.

— rajamouli ss (@ssrajamouli) July 4, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: