సందీప్ కిషన్ మాట్లాడుతూ "నేను ఎప్పుడూ నా సినిమా ఫంక్షన్స్లో మంచి సినిమా తీశానని చెబుతా. ఫస్ట్టైమ్ చెబుతున్నా... అదిరిపోయే సినిమా తీశా. పక్కా హిట్ అయ్యే సినిమా తీశా. అది నేనొక్కడినే తీశానని చెప్పడం లేదు. టీమ్ కృషి వల్ల కుదిరింది. సినిమా కోసం అందరం కష్టపడతాం. కానీ, కుదరాలి. ఈ సినిమాకి కుదిరింది. నా కెరీర్లో మోస్ట్ సక్సెస్ఫుల్ సినిమా 'నిను వీడని నీడను నేనే'. ఎందుకు అంటే... సెట్లో, టీమ్లో ఎవరికీ ఏ లోటు చేయలేదు. ఇవాళ్టి వరకూ ఒక్క రూపాయి కూడా మోసం చేయలేదు. సినిమాను మాత్రమే తీశాం. సినిమాను మాత్రమే ప్రమోట్ చేశాం. ప్రేక్షకుల దగ్గర సినిమాయే మాట్లాడుతుంది. నిజాలు మాట్లాడుకోవాలంటే... ఈ రోజు ఉదయం వరకూ సినిమా విడుదల అవుతుందో? లేదో? మాకు తెలియదు. అంత టెన్షన్. నాకు తెలిసింది ఒకటే... కథను నమ్మాలి. ఆ కథను బాగా తీయాలి.
కరెక్టుగా ప్రమోట్ చేయాలి. జనాల్లోకి తీసుకువెళ్లాలి. మన పని మనం చేసుకుంటూ వెళతాం. కానీ, ఒకడు ఒక సినిమా తీస్తున్నాడంటే... సంబంధమే లేకుండా ఆ సినిమాను ఆపడానికి బయలుదేరతారు. అందరి కన్నా.. అన్నిటి కన్నా సినిమా గొప్పది. ఆ సినిమాను ఆ సినిమా కాపాడుకుంటూ వస్తుంది. అదే 'నిను వీడని నీడను నేనే'. ఈ సినిమాకు విపరీతమైన అడ్డంకులు వచ్చాయి. నాకే షాక్. ఇదొక మిరాకిల్. నేను, మా ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు శివ చెర్రీ, సీతారామ్ కూర్చుని ఇటువంటి చిక్కులు వచ్చాయేంటని ఆలోచించుకుంటూ ఉంటే మరుసటి రోజుకు చిక్కులు తొలగిపోయేవి. ఎలాగో మాకూ తెలియదు. మంగళవారం అయితే హై టెన్షన్ మూమెంట్. ఏం జరుగుతుందో తెలియదు. శివ, సీతారామ్ ఏడుస్తున్నారు. వీళ్లిద్దరూ లేకపోతే నేను లేను. వీళ్లను నాకు దేవుడు ఇచ్చిన ఫ్యామిలీ అనొచ్చు. ఫ్రెండ్స్ అనొచ్చు. వీళ్లే సినిమాను ఇక్కడి వరకూ తీసుకొచ్చారు. అలాగే. మా ఎడిటర్ ఛోటా కె. ప్రసాద్, రైటర్ సామ్రాట్ ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారు. 'ఎస్ఎమ్ఎస్'కి 77మంది దగ్గర అప్పు చేస్తే గానీ సినిమా కుదరలేదని సుధీర్ బాబు చెప్పాడు. ఒక మనిషి 77 మంది దగ్గర అప్పు ఎలా చేస్తాడని నాకు అర్థం కాలేదు. ఇవాళ నాకు అర్థమైంది. రామజోగయ్య శాస్త్రిగారు కథకు కీలకమైన పాట రాశారు. ఆయన తప్ప ఇంకెవరూ రాయలేరు. ఆ పాటను మేము విడుదల చేయలేదు. సినిమాలోనే చూడాలి. విడుదల రోజున ఆ పాటను అందరికీ వినిపిస్తాం. ఈ కథ ఈ టైమ్లో నా దగ్గరకు రావడం అదృష్టం. ఈ నెల 12న సినిమాను చూడండి. తప్పకుండా హిట్ అవుతుంది. కాన్ఫిడెంట్గా ఉన్నాను" అని అన్నారు.
కార్తికేయ మాట్లాడుతూ "నా సినిమా ఫంక్షన్స్కి, ఇతరుల ఫంక్షన్స్కి ఎప్పడూ వెళ్లలేదు. నన్ను ఎవరూ గెస్ట్గా పిలవలేదు. ఫస్ట్ టైమ్ సందీప్ అన్న పిలిచారు. నాకంటే సీనియర్ అయినా... నేను జిమ్లోనూ కానీ, బయట ఎక్కడైనా కనిపించినా సందీప్ అన్న చక్కగా మాట్లాడతారు. ఆయనను చూస్తే నాకు తెలియకుండా 'బిగ్ బ్రదర్' అనే ఫీలింగ్ వస్తుంది. సినిమాలపై ఆయనకున్న ప్రేమ నన్ను ఇన్స్ఫైర్ చేస్తుంది. డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు తానే నిర్మాతగా మారారు. 'హిప్పీ' ప్లాప్ తరవాత నేను కోలుకోవడానికి టైమ్ పట్టింది. ఏడెనిమిదేళ్లల్లో సందీప్ అన్న ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశారు. స్ట్రాంగ్గా నిలబడ్డారు. దట్స్ రియల్లీ ఇన్స్ఫైరింగ్. జూలై 12న లాస్ట్ ఇయర్ మా 'ఆర్ ఎక్స్ 100' విడుదలైంది. ఈ ఇయర్ 'నిను వీడని నీడను నేనే' వస్తుంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ చాలా బావున్నాయి. ఇదీ బ్లాక్బస్టర్ అవుతుంది" అని అన్నారు.
దర్శకుడు కార్తీక్ రాజు మాట్లాడుతూ "ఈ సినిమా నాకు వెరీ వెరీ స్పెషల్. సందీప్ కిషన్కి స్క్రిప్ట్ వినిపిస్తే నటించడానికి మాత్రమే కాదు, నిర్మించడానికి కూడా ముందుకొచ్చారు. ఆయనతో పాటు మిగతా ఇద్దరు నిర్మాతలు దయా పన్నెం, వీజీ సుబ్రహ్మణ్యన్ గారికి థాంక్స్. సినిమా విడుదల దగ్గరలో ఉంది కనుక ఎక్కువ మాట్లాడను. ప్రేక్షకులందరికీ సినిమా నచ్చుతుందని చెప్పగలను" అని అన్నారు.
అన్యా సింగ్ మాట్లాడుతూ "నా ఫస్ట్ తెలుగు మూవీ 'నిను వీడని నీడను నేనే'. నా ఫస్ట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇది. సినిమాపై ఎంతో ప్రేమ కల ఈ టీమ్తో పని చేయడం నా అదృష్టం. సినిమా చూసి నన్ను హీరోయిన్గా ఆదరిస్తారని కోరుకుంటున్నా" అని అన్నారు.