ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడల్లా ఈ రెండు దేశాల ప్రజలు భావోద్వేగంతో రగిలిపోతు ఉంటారు. ఇండియా ఓడిపోవాలని పాకిస్తాన్ ప్రజలు అణువణువునా కోరుకుంటారు. ఇలాంటి మానసిక యుద్ధ వాతావరణం కొనసాగుతున్న పరిస్థుతులలో ఒక పాకిస్తాన్ హీరోయిన్ ప్రభాస్ ను ప్రశంసిస్తూ చేసిన ట్విట్ అత్యంత సంచలనంగా మారింది.
‘
సాహో’ సంబంధించి ఈమధ్యన విడుదలైన “సైకో సయాన్” పాట తెలుగు ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోయినా ఆపాట విపరీతంగా పాకిస్తాన్ యూత్ కు కనెక్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రస్తుతం పాకిస్తాన్ యూత్ కు క్రేజీ హీరోయిన్ గా మారిన మవ్రా హొకెన్ ‘సయ్యా సైకో’ సాంగ్ ను ఇష్టపడటమే కాకుండా ఆపాటను హ్యాష్ ట్యాగ్తో జత చేస్తూ ప్రభాస్ అంటూ ట్వీట్ చేయడం పాకిస్తాన్ మీడియాలో హాట్ న్యూస్ గా మారింది.
అంతేకాదు ‘సాహో’ విడుదల గురించి తాను ఎదురు చూస్తున్నానని ఈమూవీని మొదటిరోజు ఇండియా వచ్చి చూడాలని కోరుకుంటున్నానని ఆమె చేసిన కామెంట్స్ ప్రభాస్ అభిమానుల మధ్య హాట్ న్యూస్ గా మారింది. ఈ పాకిస్తానీ హీరోయిన్ గతంలో బాలీవుడ్ మూవీ `సనమ్ తేరీ కసమ్` లో నటించింది.
అయితే ఆతరువాత ఇండియా పాకిస్తాన్ మధ్య మారిన పరిస్థుతుల రీత్యా పాకిస్తాన్ నటీనటులకు ఇండియన్ సినిమాలలో అవకాశాలు ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో ఆమెకు బాలీవుడ్ లో అవకాశాలు రావడం లేదు. ఈవిషయాలను పట్టించుకోకుండా ఒక పాకిస్తాన్ క్రేజీ హీరోయిన్ ప్రభాస్ పై మనసు పారేసుకోవడం ప్రభాస్ మ్యానియాకు నిదర్శనం..