టాలీవుడ్లో హీరోయిన్ గా సక్సెస్ అవ్వడం అంత సులువేమి కాదు. కొందరు హీరోయిన్లు తమ తొలి చిత్రంతోనే ఫేమస్ అవుతారు.. మరికొందరికి కొన్ని చిత్రాల తర్వాత కానీ హిట్ పడదు. తమ అందచందాలతో మెప్పించి, నటనతో ప్రేక్షకులను అకట్టుకుంటేనే వారు వెండితెర మీద నిలవగలరు. ఇప్పడు తాజాగా కొందరు హీరోయిన్లకు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు. ఈ హీరోయిన్లకు ఇప్పుడు అర్జెంట్గా హిట్ కావాల్సిందే... లేకపోతే వీళ్లను ప్రేక్షకులు మర్చిపోవడం ఖాయం.
అను ఇమ్మాన్యుయేల్: అను తన కెరీర్ ప్రారంభంలోనే మజ్ను చిత్రంతో హిట్ కొట్టింది. ఆ తర్వాత స్టార్ హీరోలు అల్లు అర్జున్, పవన్ కళ్యాన్ సరసన నటించేందుకు ఛాన్స్ దక్కించుకుంది. కానీ ప్రస్తుతం ఆమెకు ఛాన్సులు స్లో అయిపోయాయి. అనూకు అర్జెంటుగా ఓ హిట్ కావాలి.
రెజీనా : టాలీవుడ్ లో రెజీనా స్టార్ హీరోయిన్ అవుతుందని స్టార్టింగ్లో టాక్ వినిపించాయి. సాయిధరమ్, సందీప్కిషన్ లాంటి హీరోలు వరుసగా ఛాన్సులు ఇచ్చినా... తర్వాత స్టార్ హీరోలు ఆమెను పట్టించుకోలేదు. ప్రస్తుతం రెజీనా అడవి శేష్ సరసన ఎవరు చిత్రంలో నటిస్తోంది.
ఇక వెండితెర మీద మరో సౌందర్యగా ప్రశంసలు అందుకున్న నిత్యను ఇప్పుడు ప్రేక్షకులు మర్చిపోయారు. సాయి పల్లవిప్రస్తుతం రానా సరసన విరాటపర్వం సినిమాలో నటిస్తోంది. ఫిదా రేంజ్ హిట్ ఇప్పుడు ఆమెకు అవసరం. సీనియర్ హీరోయిన్ కాజల్కు వరుస పరాజయాలు పలకరిస్తున్నాయి. ఆమెకు ఛాన్సులు ఇచ్చే వారు కూడా లేరు. అనుపమ పరమేశ్వరన్ కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యు, హాలోగురు ప్రేమకోసమే లాంటి చిత్రాలతో నిరాశ పరిచింది. ఇప్పుడు ఆమెకు హిట్ తప్పనిసరి.
కమల్ వారసురాలుకు రవితేజ సినిమాలో ఛాన్స్ అంటున్నా నమ్మే పరిస్థితి లేదు. ఆమె కెరీర్ పూర్తిగా రివర్స్ అయ్యింది. ఇక అవికాగోర్, అంజలి, లావణ్య త్రిపాఠి, ప్రగ్య జైశ్వాల్ల గురించి మాట్లాడుకోవడమే వేస్ట్ అన్నట్టుగా ఉంది. ప్రస్తుతం తెలుగు యువతలో హాట్ టాపిక్ గా నిధి అగర్వాల్ కెరీర్ లో తొలి సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది. త్వరలో విడుదల కాబోతున్న ఇస్మార్ట్ శంకర్ చిత్రంపైనే ఈ ముద్దుగుమ్మ ఆశలన్నీ పెట్టుకుంది. ఇక జనాలు మర్చిపోయిన కేథరిన్ ఒకప్పుడు తన హాట్ హాట్ అందాలతో అలరించింది. కేథరిన్ కెరీర్ లో సరైన సక్సెస్ లేకపోవడమే సమస్యగా మారింది. ఆమెకు హిట్ చాలా అవసరం.