పాపం మహేశ్ బాబు ని ఆడేసుకున్నారు !
ఇదిలా ఉండగా తాజాగా ఇటీవల వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ ను ఉద్దేశించి మహేష్ బాబు ట్విట్టర్లో చేసిన కామెంట్లపై నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. 2019 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ చూపించిన పొరాట పటిమకు ఫిదా అయిన సూపర్ స్టార్ మహేష్ ``ఇంగ్లాండ్ కప్ గెలుచుకున్నా కానీ న్యూజిలాండ్ మనసు గెలుచుకుంది`` అని పోస్ట్ పెట్టారు.
అదీ మ్యాచ్ అయిపోయాక కాస్త ఆలస్యంగా స్పందించారు. ఇక్కడే మహేష్ నెటిజన్ లకు దొరికిపోయారు. ఆదివారం మ్యాచ్ జరిగితే సోమవారం అర్ధరాత్రి స్పందించడం ఏమిటని మహేష్ ని ఓ రేంజ్ లో నెటిజన్స్ తూలనాడడం చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడో స్పందించాల్సిన మహేష్ చాలా లేటుగా స్పందించడంతో మహేష్ బాబుని ట్రోలర్లు ఆర్ఎస్ పోవడంతో సోషల్ మీడియాలో మహేష్ పరిస్థితి పాపం ఉన్నట్టుగా ఉంది.