అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో యంగ్ హీరో కార్తికేయ, అనఘా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం "గుణ369". కాగా ఆగష్టు 2వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రాన్ని స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్ పై తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో "గుణ 369" టీమ్ ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు.
ఈ సందర్భంగా ముందుగా చిత్రబృందం మొత్తం రేపు వైజాగ్ వెళ్లనున్నారు. వైజాగ్ లోని రెండు కాలేజీల్లో స్టూడెంట్స్ తో తమ సినిమా సమతులు పంచుకోనున్నారు. రేపు మధ్యాహ్నం 1 కి విజ్ఞాన్ కాలేజ్ కి, 3 గంటలకి రఘు కాలేజ్ లకు వెళ్లనున్నారు. ఈ కథ వాస్తవ కథ అంట. అర్జున్ జంధ్యాల చెప్పిన రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా 'గుణ 369' సినిమాను చేస్తున్నాడు. మరి ఈ సారి కూడా కార్తికేయకి రియల్ స్టోరీ హిట్ ఇస్తోందేమో చూడాలి.