అది నిజం కాదండి .. వాళ్ళు బంగారం అండి : రామ్ ట్విట్

guyyala Navya
'ఇస్మార్ట్ శంకర్' టాలీవుడ్ లో ప్రస్తుతం ట్రేండింగ్ సినిమా. ఎంతో కాలానికి ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టాడు పూరి జగన్నాథ్, అలానే ఛార్మి కూడా నిర్మాతల మొదటి సినిమాతోనే సక్సెస్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఇస్మార్ట్ శంకర్ టీం అంత ఫుల్ హ్యాపీగా పార్టీల మీద పార్టీలు చేసుకుంటున్నారు. 


అలాంటి మాస్ పార్టీకి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ముఖ్య అతిథిగా వచ్చాడు. అతను ఆ సినిమా గురించి ఎంత అల్లరి చేసాడు అనేది చెప్పాల్సిన అవసరం. పార్టీలో అతని తలపై అతనే మందు పోసుకొని రచ్చ చేస్తే రోడ్డుపై ట్రిపుల్ రైడింగ్ చేసి పోలీసులకే ఎదురు ప్రశ్నలు వేసి అన్ని ఛానల్స్ లో న్యూస్ వచ్చేలా చేసి ఇస్మార్ట్ శంకర్ కి 'ఫ్రీ' ప్రేమోషన్స్ చేశాడు రాంగోపాల్ వర్మ. 


ఇలా ఒక్కరు కాదు ఇస్మార్ట్ శంకర్ సినిమా కోసం ఎంతోమంది కష్టపడ్డారు. అలాంటి సినిమాపై ఓ వెబ్ సైట్ ఓ గాసిప్ రాసింది. 'పూరి జగన్నాథ్, ఛార్మి.. రామ్ కు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ 5 కోట్లలో కేవలం 2.5 కోట్లు మాత్రమే ఇచ్చారని, అందుకు రామ్ బాధలో ఉన్నాడని'' రాశారు. ఈ వార్త చుసిన రామ్ స్పందిస్తూ ''నేను మాములుగా ఇలాంటి వార్తలకు స్పందించాను కానీ ఈ వార్తకు స్పందిస్తున్నాను, ఛార్మి, పూరి జగన్నాథ్ బంగారం అండి'' అంటూ స్పదించారు. ఈ ట్విట్ కాస్త ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అవుతుంది.  
LMAO!! I generally don’t like to respond to such fake news..but in this case...

”Bangaram andi vellu..😘 @purijagan @Charmmeofficial “

— Ustaad iSmart Shankar (@ramsayz) July 22, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: