ఈ దుర్మార్గం చూశారా..రజినీ భార్య ఆవేదన!

Edari Rama Krishna
ఈ మద్య కాలంలో మానవత్వం నశించిన ఎన్నో దుర్మార్గపు చర్యలకు పాల్పపడుతున్నారు కొంతమంది.  మానవ సంబంధాలకే మచ్చ తెస్తూ అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ..తమకు అడ్డుగా వస్తున్న సంతానాన్ని సైతం దారుణంగా చంపిన సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. భార్యభర్తల సంబంధాలకే మచ్చ తెస్తూ ప్రియుడి కోసం భర్తను,ప్రియురాలి కోసం భార్యను కిరాతకంగా చంపుకుంటున్నారు.

తాజాగా ఓ మహిళ చిన్నారిని కొడుతూ, కాలితో తొక్కుతూ, కింద పడేస్తూ చిత్రవధకు గురిచేస్తున్న వీడియో సూపర్ స్టార్ రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో సంచలనంగా మారింది.  గత కొంత కాలంగా రజినీకాంత్ సతీమణి లతా రజినీకాంత్  దయా ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ పౌండేషన్ ఎక్కువగా అనాధ పిల్లలని అక్కున చేర్చుకుంటుంది. పీస్ ఆఫ్ చిల్డ్రన్ పేరుతో లతా రజనీకాంత్ సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా తన నోటీస్ లోకి వచ్చి ఈ వీడియో పై లతా రజనీకాంత్ స్పందిస్తూ.. చిన్నారి ఆచూకీ తెలిసిన వారు తమకు ఫోన్ చేయాలని ట్విట్టర్ లో ఫోన్ నెంబర్ పొందుపరిచారు.
Peace for Children:let's come together and make a difference.Kindly request everyone to help track this atrocity been committed to a helpless child.Justice must be served and the guilty punished if anyone has any information please share with us at our toll free number18001208866 pic.twitter.com/QFtMsOAbcu

— Latha Rajinikanth (@OfficialLathaRK) July 19, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: