మాల్దీవ్స్ లో చెర్రీ, ఉపాసన ఎంజాయ్!

siri Madhukar

మెగాస్టార్ తనయుడు మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఆయన సతీమణి ఉపాసన మాల్దీవ్స్ లో సేద తీరుతున్నారు.  కొద్దిరోజులక్రితం తమ వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకోవడానికి సౌత్ ఆఫ్రికా వంటి పలు ప్రాంతాల్లో విహరించిన ఈ జంట ఇప్పుడు మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. జూలై 20 ఉపాసన బర్త్‌డే సందర్భంగా చెర్రీ తన భార్యను సర్‌ప్రైజ్ చెయ్యడానికి మాల్దీవ్స్ తీసుకెళ్లాడు. 


 ప్రస్తుతం రాంచరణ్ - ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ రాజమౌళి తెరకెక్కిస్తున్నారు.  ఆ మద్య పూనే లో మూవీ షెడ్యూల్ జరుపుకునేందుకు వెళ్లగా జిమ్ లో రాంచరణ్ కాలికి గాయం కావడంతో వారిదా పడింది.  ఆ తర్వాత ఎన్టీఆర్ చేయికి గాయం కావడం ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ కాస్త పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ ప్రిపరేషన్ లో ఉన్నారు రాజమౌళి.  ఈ నేపథ్యంలో కాస్త విరామం దొరకడంతో రామ్ చరణ్ తన భార్యతో కలిసి హాలీడే ట్రిప్‌కు మాల్దీవ్స్ వెళ్లాడు.


ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను షేర్ చేసుకునే ఉపాసన.. మాల్దీవ్స్‌లో ఇద్దరూకలిసి తీసుకున్న బ్యూటిఫుల్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ పిక్ పోస్ట్ చేస్తూ భర్తపట్ల తన ప్రేమను వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా 'థ్యాంక్స్ ఫర్ మేకింగ్ ఎవ్రీడే సో స్పెషల్.. ఐ రియల్లీ లవ్యూ అండ్ లుక్ అప్ టూయూ'.. అంటూ ఉపాసన చేసిన ఈ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

My Dearest Mr C https://t.co/voZadtDABI thanks for making everyday so special. I REALLY LOVE U & LOOK UP TO U. Ur unconditional love & kindness inspires me. Thanks for an amazing birthday ❤️😘 pic.twitter.com/Qr2UYrd4Wa

— Upasana Konidela (@upasanakonidela) July 22, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: