బిగ్ బాస్ : నాగార్జున గారి లెవల్ ఏంది ? ఈ పత్తి యాపారం ఏంది ?

guyyala Navya
బిగ్ బాస్ ఈ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. ఆలా లేకుండా సెన్సేషన్ అవుతుంది ఈ బిగ్ బాస్ షో. స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ షో ఎన్నో వివాదాల మధ్య గత ఆదివారం ప్రారంభమయ్యింది. ప్రారంభమయ్యి కనీసం 4 రోజులైనా అవ్వలేదు బిగ్ బాస్ హౌస్ టాప్ లేచి పోయేలా గొడవ పడుతున్నారు బిగ్ బాస్ 15 మంది కంటస్టెంట్లు. 


బిగ్ బాస్ హౌస్ కి కాంటస్టెంట్లు వచ్చిన మొదటి రోజే బిగ్ బాస్ 'నామినేషన్' అంటూ కాంటస్టెంట్ల మధ్య గొడవ పెట్టేసాడు. దీంతో ఆ నామినేషన్ గోల వల్లే రోజుకు ఒక గొడవ జారుతుంది. రెండొవ రోజు శ్రీముఖి, హిమజ, హేమ గొడవ పెట్టుకోగా మూడోవ రోజు శ్రీముఖి వల్లే మళ్ళి గొడవ మొదలైంది. ఆ గొడవ అంత మాములుగా లేదు లెండి. ఒకరిని ఒకరు తిట్టుకుంటూ కొట్టుకునే వరకు వెళ్లారు. 


ఆలా పడే సమయంలోనే నిన్నటి ఎపిసోడ్ కి తేరా పడింది. కానీ ఇంకా ఆ గొడవ అలానే సాగుతుంది. ఆలా గొడవ పడుతున్నప్పుడు 'హేమ' మాట్లాడుతూ నాగార్జున గారు వస్తారు కదా ఆయనే చెప్తారు అని చెప్పింది. దీంతో మరో కాంటస్టెంట్ 'మహేష్ విట్టా' స్పందిస్తూ 'నాగార్జున గారి లెవల్ ఏంది ? ఈ పత్తి యాపారం ఏంది ?' అంటూ సెటైర్ వేసాడు. దీంతో హేమ షాక్ అయ్యింది. ఇక్కడితో ఈరోజు ప్రోమో ముగిసింది. ఏది ఏమైనా హేమక్క ఫస్ట్ నుంచి ఓవర్ యాక్షన్ చేస్తుంది అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. 


Meerandaru Tension Padakandi 😂😂#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/Ms5oeEL77c

— STAR MAA (@StarMaa) July 25, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: