ఆ నలుగురు లేనిదే కొబ్బరి మట్ట లేదు - దర్శకుడు రోనాల్డ్సన్
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రోనాల్డ్ సన్ మాట్లాడుతూ... 'హృదయకాలేయం' చిత్రం సమయంలో విడుదలకు కొన్ని ఇబ్బందులు పడ్డాం. ఎవరీ హీరో.. మార్కెట్ అవుతుందా! అనే ప్రశ్నలతో వ్యాపారం మందకొడిగా సాగింది. ఆ తర్వాత ఆ చిత్రం పేరు రావడం జరిగింది. ఇక ఈ కొబ్బరి మట్ట చిత్రాన్ని బాహుబలి తరహాలో ఐదేళ్ళు తీయడానికి పట్టింది. సినిమా గురించి వివరాలను చాలా మంది అడిగేవారు. ఒక్కోటి ప్రమోషన్లో భాగంగా విడుదల చేయగా ఆసక్తి పెరిగింది. ఇండస్ట్రీలో ఆ నలుగురు వల్లే మా చిత్రం నిలబడింది. గీతా ఆర్ట్స్ద్వారా మా చిత్రం విడుదలకాబోతుంది. నైజాంలో దిల్రాజుగారు విడుదల చేస్తున్నారు. ఆ నలుగురులేనిదే కొట్టరిమట్టలేదు. కంటెంట్ వుంటే విడుదలకు సహకరిస్తారనేందుకు మా చిత్రమే నిదర్శనం.
ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానని' అన్నారు. సంపూర్ణేష్బాబు మాట్లాడుతూ.. ఇందులో మూడు పాత్రలు పోషించాను. యాక్షన్ కామెడీ సెంటిమెంట్ ,రొమాన్స్ సందేశం అన్ని అంశాలున్న కొత్త జోనర్ అని తెలిపారు. నిర్మాత సాయిరాజేష్ మాట్లాడుతూ.. దాదాపు నాలుగేళ్ళ ప్రయాణం మా చిత్రం. గీతా ఆర్ట్స్ వాళ్ళ సహకారంతో చిత్రాన్ని విడుదల చేఉసేందుకు మార్గం సుగమమైంది. హృదయకాలేయం చిత్రాన్ని చేసిన టీమ్ కావడంతో ఈ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చింది. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్తో చిత్రానికి అంచనాలు పెరిగాయి. ఇప్పటికే టిక్కెట్స్ బుకింగ్ 80శాతం పూర్తయిందని' అన్నారు. ఇంకా ఈ చిత్రంలో కత్తిమహేష్, నిర్మాత ఎస్కె.ఎన్., ఏలూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు.