1989 లో "శివ" చిత్రంతో నాగార్జున హిరోగా చేసిన సినిమాలో సహాయ దర్శకుడిగా పని చేయడమే కాకుండా చిన్న పాత్రల్లో నటించి మెప్పించిన నటుడు 'ఉత్తేజ్'. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారానే ఉత్తేజ్ మన తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు. తర్వాత తనదైన నటనతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. కమెడియన్ గా చందమామ చిత్రానికి నంది అవార్డును గెలుచుకున్నారు. అతను చాలా మంది ప్రధాన నటులతో కలిసి నటించాడు మరియు గులాబీ చిత్రానికి కృష్ణ వంశీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశాడు.
సినీ పరిశ్రమలో ఆయన చేసిన మంచి పనులకు ఆయన ప్రశంసలు అందుకున్నారు.టాలీవుడ్ చేత ప్రముఖ పాత్రల కోసం ఎప్పుడూ ఉపయోగించని ప్రతిభావంతులైన కళాకారుడు. నటనకు సంబంధించిన శిక్షణ సంస్థను స్థాపించి ఆసక్తి ఉన్న యువతీ, యువకులకు శిక్షణనిస్తున్నారు.ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వారసత్వ నటుల గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. దానికి సంబంధించిన వార్తలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయని, వారసత్వం అనేది నాగార్జున కాలం నుండి చూస్తున్నామని అయితే నటవారసులకు కూడా ఒకటి, రెండు ఛాన్సులు మాత్రమే ఉంటాయని,
నటవారసులు కూడా నిరూపించుకోకపోతే ఏం జరుగుతుందో మనకు తెలుసని ఉత్తేజ్ చెప్తూ, రామ్ చరణ్ చాలా ప్రొఫెషనల్ యాక్టర్ అది తన తండ్రి నుంచి వచ్చిన క్వాలిటీ, అల్లు అర్జున్ తొలి సినిమా నుండి ప్రతి సినిమాకూ తనను తాను చెక్కుకున్నారని, రవితేజ రియలిస్టిక్ గా నటిస్తారని చెప్పి ఎన్టీఆర్ పెద్ద స్టారే కాదు వృత్తి నిబద్ధత ఉన్న నటుడని తెలిపారు ఉత్తేజ్. ఉత్తేజ్ వ్యాఖ్యలు పరిశ్రమలో మంటలు పెట్టిస్తున్నాయి. ఎన్టీఆర్ పై అంత మాట అనడం ఎవరు భరించలేకపోతున్నారు. మరి చూద్దాం ఈ వ్యాఖ్యలు ఇంకా ఎంత దూరం వెల్తాయో దీనికి మన ఎన్టీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో.