కన్నడ మెగాస్టార్ కిచ్చా సుదీప్ ఇప్పుడు బాహుబాషా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. గతంలో బాలీవుడ్ లో నటించిన కిచ్చా సుదీప్ ఆ మద్య రాజమౌళి-నాని కాంబినేషన్ లో వచ్చిన ‘ఈగ’సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు. సాధారణంగా రాజమౌళి సినిమాలంటేనే హీరో-విలన్ కి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈగ సినిమాలో గ్రాఫిక్ టెక్నాలజీతో రూపొందించిన ఈగతో తలపడతాడు కిచ్చా సుదీప్. ఈ మూవీ తర్వాత మరోసారి రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి’లాంటి ప్రతిష్టాత్మక సినిమాలో నటించాడు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ మూవీలో కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు కిచ్చా సుదీప్. అయితే బాహుబషల్లో నటిస్తున్న సుదీప్ తన సినిమాలు ఆయా లాంగ్వేజ్ ల్లో రిలీజ్ చేస్తున్నాడు. తాజాగా ‘పహిల్వాన్’ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కిచ్చ సుదీప్. ఈ మూవీ కన్నడలో రూపొందింది. నటుడు ఎస్.కృష్ణ దర్శకత్వంలో పహిల్వాన్ అనే మూవీలో చేస్తున్నాడు. స్వప్న కృష్ణ పహిల్వాన్ నేతృత్వంలో నిర్మితం అవుతుంది. ఈ సినిమా కోసం పలు కసరత్తులు సైతం చేశారు సుదీప్.
ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో ‘పహిల్వాన్’ కనిపిస్తుంది. తొలిసారిగా సుదీప్ ఈ సినిమాలో కుస్తీ వీరునిగా, బాక్సర్గా అభిమానులను అలరించబోతున్నారు. ఆకాంక్ష సింగ్ హీరోయిన్గా నటిస్తుంది.
ఈ సినిమాలో కబీర్ దుహాన్సింగ్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా తెలుగు ట్రైలర్ రిలీజ్ అయ్యింది..ఇక ట్రైలర్ విషయానికి వస్తే..బలం ఉందనే అహంతో కొట్టేవాడు రౌడీ..బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ట్రైలర్ ఎండింగ్ లో ‘నేను గెలుస్తానో..గెలవనో తెలియదు, కానీ ఓటమిని మాత్రం ఎప్పటికీ ఒప్పుకోను అంటూ కిచ్చా సుదీప్ డైలాగ్ అదిరిపోయింది. సెప్టెంబర్ 12న ఈ మూవీ విడుదల కానుంది.