ఎవరు సినిమాపై కళ్యాణ్ రామ్ సెన్సేషనల్ కామెంట్స్..!

shami
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఎవరు సినిమా చూశారట. చూసిన వెంటనే సినిమాపై తన అభిప్రాయాన్ని ట్వీట్ రూపంలో వ్యక్తపరిచారు. ఇప్పుడే ఎవరు సినిమా చూశాను. మంచి నటన కనబరచిన అడివి శేష్, రెజినా, నవీన్ చంద్రలకు కంగ్రాట్స్. దర్శకుడు వెంకట్ రాంజీ మొదటి సినిమానే చాలా అద్భుతంగా తీశారు.    


అంతేకాదు సినిమా నిర్మాత పివిపి గారికి కంగ్రాట్స్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. కళ్యాణ్ రామ్ ట్వీట్ తో ఎవరు సినిమాకు మరింత బూస్టింగ్ దొరికిందని చెప్పొచ్చు. తను చూసిన సినిమా బాగుందని చెప్పడంలో తెలుగు హీరోలు ఎప్పుడూ ముందుంటారు.         


ఈ క్రమంలో కళ్యాణ్ రామ్ ఎవరు సినిమాపై చేసిన ట్వీట్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. ఎవరు సినిమాపై కళ్యాణ్ రామ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక కళ్యాణ్ రామ్ సినిమా విషయానికొస్తే అతను సతీష్ వేగేశ్న డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు ఎంత మంచివాడవురా టైటిల్ ఫిక్స్ చేశారు. సినిమాలో కళ్యాణ్ రామ్ తన వాళ్లు కాకపోయినా అందరి హెల్ప్ చేసే వ్యక్తి పాత్రలో నటిస్తున్నాడు.         


ఈమధ్యనే మొదలైన ఈ సినిమా గుజరాతీ సినిమాకు రీమేక్ అన్న వార్తలు వస్తున్నాయి. అయితే దర్శకుడు సతీష్ వేగేశ్న మాత్రం ఈ రీమేక్ వార్తలపై స్పందించలేదు. సినిమాలో కళ్యాణ్ రామ్ కు జోడీగా మెహ్రీన్ కౌర్ నటిస్తుంది. ఆదిత్య మ్యూజిక్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మహేష్, అల్లు అర్జున్ సినిమాలతో పాటు సంక్రాంతి బరిలో కళ్యాణ్ రామ్ దిగుతున్నాడు.     



Just watched #Evaru. Congratulations @AdiviSesh , @ReginaCassandra and @Naveenc212 for the fantastic performances. Director @ramjivv, you nailed it with your debut film. Congratulations @PrasadVPotluri garu for the success. Happy to see ‘good cinema’ winning at the Box Office

— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) August 23, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: