గత ఏడాది యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా లో హీరోయిన్ చెల్లెలి పాత్రలో కనిపించింది తెలుగు బ్యూటీ ఈషా రెబ్బ. అయితే పెద్దగా గుర్తింపు లేని పాత్ర కావడంతో ఈచిత్రం ఆమె కు బ్రేక్ ఇవ్వలేదు. ఇక ఈ సినిమా తరువాత ఈషా ప్రస్తుతం తెలుగులో డమరకం ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్ లో 'రాగల 24 గంటల్లో' అనే హారర్ థ్రిల్లర్ లో నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసింది ఈషా. ఇక ఈ సినిమా తోపాటు కోలీవుడ్ లో జి వి ప్రకాష్ కుమార్ హీరోగా ప్రముఖ దర్శకుడు ఏజిల్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న చిత్రంలో ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రానికి 'ఆయిరం జన్మంగల్' అనే టైటిల్ ఖరారు చేశారు. యువ హీరో విష్ణు విశాల్ ఈ టైటిల్ ను రివీల్ చేశారు.
హారర్ కామెడీ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్నారై గర్ల్ నిఖిషా పటేల్ , ప్రముఖ కమెడియన్ సతీష్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అభిషేక్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. కాగా ఈషా రెబ్బ కు తమిళంలో ఇది రెండో సినిమా. ఇంతకుముందు ఆమె 'ఓయ్' అనే చిత్రం తో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 2016 లో విడుదలైన ఆ చిత్రం పరాజయం చెందడంతో ఈషా కు ఆఫర్లు రాలేదు. ఆ తరువాత తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించి నటిగా మంచి పేరు తెచ్చుకుంది కానీ బిజీ కాలేకపోయింది. దాంతో మళ్ళీ కోలీవుడ్ లో సినిమా ఆఫర్ రావడంతో వెంటనే ఓకే చెప్పేసింది. ఇక తెలుగులో ఆఫర్లను రాబట్టుకోలేకపోతున్న ఈషా రెబ్బ ఈ ఆయిరం జన్మంగల్ తో హిట్ కొట్టి కోలీవుడ్ లోనైనా బిజీ అవుతుందో లేదో చూడాలి.