ఎట్టకేలకు అఖిల్ హీరోయిన్ కన్ఫామ్…!
మొన్నటి వరకు ఈ సినిమాకి ఎవరు హీరోయిన్ అన్నదానిపై రకరకాల వార్తలు వినపడ్డాయి. మొదటిగా సినిమాలో అఖిల్ పక్కన సాయి పల్లవి హీరోయిన్ అని అందరూ అనుకున్నారు ఇదే సమయంలో సాయి పల్లవి కూడా రెడీ అయ్యింది. కానీ చివరి నిమిషంలో సినిమా నుండి అనుకోకుండా డ్రాప్ అయ్యింది. ఇదే తరుణంలో తర్వాత రష్మికని హీరోయిన్ గా తీసుకుందామంటే.. ఆమె ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. సో.. కాల్షీట్స్ అడ్జస్ట్ చేయలేకపోతుంది. ఫైనల్ గా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమాకి ఆమె ఎంత డిమాండ్ చేసిందో తెలుసా.. అక్షరాలా.. రూ.3.5 కోట్లు.. దీంతో మొదటి గీతాఆర్ట్స్ వెనక్కి తగ్గింది. కానీ అఖిల్ ఒత్తిడి తీసుకురావడంతో ఒప్పుకోక తప్పలేదు. దీంతో త్వరలోనే పూజాహెగ్డే షూటింగ్ లో పాల్గొంటున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ 'వాల్మీకి', 'అల వైకుంఠపురం' వంటి సినిమాల్లో నటిస్తోంది. చేసిన మూడు సినిమాలు దారుణమైన ఫలితాలు రావడంతో ఈ సినిమాతోనైనా అఖిల్ హిట్ కోడతారేమో అని ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నారు అక్కినేని అభిమానులు మరియు కుటుంబ సభ్యులు.