సమంత సేమ్ టూ సేమ్ అంటున్న మహేష్ భార్య నమ్రత

Sirini Sita
సినిమా పరిశ్రమలో స్నేహ బంధం కొనసాగుతుంది. అవును తెలుగు సినిమా ఇండస్ట్రీలో మన సెలబ్రిటీలు ఒకరినొకరు ట్వీటర్లో ఫాలో అవ్వడం, ఒకరి ట్వీట్లకు మరొకరు కామెడీ సెటైర్లు వేసుకోవడం చూస్తూ ఉన్నాం. ఇక తాజాగా సమంత ట్వీట్ చేసిన ఓ ఫోటోకి  మహేష్ బాబు భార్య  నమ్రత శిరోద్కర్ ఆసక్తికర ట్వీట్ చేసింది. దీనికి సామ్ కూడా రీట్వీట్ చేసింది. ఇప్పుడు వీరిద్దరి సంభాషణ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఒకసారి ఆ వివరాలేంటో చూస్తే... 


సినీ ప్రముఖులు సోషల్‌మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలకు అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇక ఆ ట్వీట్ కి మరో సెలబ్రిటీ రిప్లయ్ ఇస్తే ఇంకెంత క్రేజ్ ఏర్పడుతుందో ఊహించవచ్చు. ప్రస్తుతం అక్కినేని ఫామిలీ అంత స్పెయిన్ లో ఎంజాయ్ చేస్తుంది. నాగార్జున తన 60వ పుట్టిన రోజు వేడుకలకు గాను అక్కినేని ఫ్యామిలీ  అంత విదేశాల్లో హల్చల్ చేస్తున్నారు. అయితే నాగార్జున,అమల,అఖిల్ కంటే ముందే సమంత చైతు స్పెయిన్ కి వెళ్లారు.


ఈ నేపథ్యంలో వారు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇక సమంత సోషల్ మీడియాలో ఎంత ఆక్టివ్ గా ఉంటుందో తెలియంది కాదు. ఈ క్రమంలో సమంత  తన భర్త నాగ చైతన్యను హగ్ చేసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతే ఫోటో పెట్టిన కాసేపటికే వైరల్ అయింది. ఇక సదరు ఫోటోకి నా చైతన్య’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇంకేముంది అక్కినేని అభిమానులు రీట్వీట్లతో మోత మోగించారు. 


ఇక సామ్ ఫోటోకి పలువురు సెలెబ్రిటీలు సైతం స్పందించారు హీరోయిన్ ప్ర‌గ్యాజైస్వాల్‌తో పాటు న‌మ‌త్ర కూడా ఈ పిక్‌కి కామెంట్ చేశారు. ముఖ్యంగా న‌మ్ర‌త ఏమని ట్వీట్ చేశారంటే... మ‌హేష్ బాబుతో క‌లిసి సేమ్ ఫోజులో దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. స‌మంత సేమ్ టూ సేమ్ అని కామెంట్ పెట్టింది. దీనికి స్పందించిన సామ్ .. వావ్ మీరిద్ద‌రు బెస్ట్ అంటూ రిప్లై ఇచ్చింది. ఘ‌ట్ట‌మ‌నేని కోడ‌లు, అక్కినేని కోడ‌లు మధ్య జ‌రిగిన ఈ సంభాష‌ణ నెటిజ‌న్స్‌ని తెగ ఆక‌ట్టుకుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: