బాలీవుడ్ సూపర్ స్టార్స్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటిస్తున్న చిత్రం "వార్" పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరెకెక్కిన ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల అవుతున్న ఈ చిత్ర ట్ర్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ మొత్తం యాక్షన్ సీన్లతో నింపేశారు.కార్ రేసులు, చేజింగ్ లతో యాక్షన్ లవర్స్ కి బాగా నచ్చేలా ఉంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు.
అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హృతిక్, టైగర్ ష్రాఫ్, సిద్ధార్థ్ ఆనంద్ లు బిజీగా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటో మీద బాలీవుడ్ అర్జున్ కపూర్ కామెంట్ చేశాడు.బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. తోటి నటుల పై సరదాగా కామెంట్లు పెడుతూ ఆటపట్టిస్తుంటాడు. అయితే అర్జున్ కపూర్ పెట్టిన ఒక కామెంట్ మాత్రం ఇద్దరి స్టార్ హీరోల అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది.
ఆ ఫొటోలో హృతిక్, టైగర్ ష్రాఫ్ లు నేల పై కూర్చుని ఉండగా.. డైరెక్టర్ సిద్దార్థ్ పైన కుర్చీలో కూర్చున్నాడు.ఆ ఫోటో పై అర్జున్ కపూర్ స్పందిస్తూ.. ‘లెజెండ్తో సాధారణ నటులు’ అని సరదాగా కామెంట్ పెట్టాడు. దాంతో హృతిక్, టైగర్ ష్రాఫ్ ల ఫ్యాన్స్ అర్జున్ కపూర్ పై సీరియస్ అవుతున్నారు. డైరెక్టర్ సిద్దార్థ్ ను లెజెండ్ తో పోల్చి.. తమ అభిమాన హీరోలను మాత్రం సాధారణ నటులు అంటావా అంటూ అర్జున్ కపూర్ ను తిడుతూ కామెంట్స్ పెడుతున్నారు ఫ్యాన్స్. వీటికి అర్జున్ కపూర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.