సైరా సినిమా అక్టోబర్ 2 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమా రిలీజ్ కు సరిగ్గా 17 రోజుల ముందు అంటే ఈనెల 15 వ తేదీ నుంచి ప్రమోషన్స్ చేయడానికి యూనిట్ రెడీ అవుతున్నది. ప్రమోషన్ విషయంలో ఏ మాత్రం రాజీపడకూడదని ప్లాన్ చేస్తున్నారు. సమకాలీకులందరితో ప్రమోషన్ చేయించేందుకు మెగాస్టార్ రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ స్టార్ అమితాబ్, కోలీవుడ్ స్టార్ రజినీకాంత్ మెగాస్టార్ ఈవెంట్స్ ను ప్రమోట్ చేయబోతున్నారని వినికిడి.
ఈనెల 15 వ తేదీన ఉయ్యాలావాడ ప్రాంతం కర్నూల్ లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని చూస్తున్నది. దీనికి సంబంధించిన అనుమతులను తీసుకునే బిజీలో ఉన్నది యూనిట్. చారిత్రాత్మక సినిమా కాబట్టి ఈవెంట్ కు అనుమతులు తప్పకుండా ఇస్తారని తెలుస్తోంది. ఒకవేళ అనుమతులు ఇస్తే కర్నూల్ లో ఎక్కడ ఈ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. ఎలా నిర్వహించబోతున్నారు అన్నది ప్లాన్ చేస్తున్నారు.
ఈ ఈవెంట్ ను సమయం చాల తక్కువగా ఉన్నది కాబట్టి వీలైనంత భారీగా ప్రమోషన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. యూనిట్ మొత్తం ఆ వేడుకలో పాల్గొనేలా చూస్తున్నారు. ఈ ఈవెంట్ తరువాత వరసగా సౌత్ లోని నాలుగు రాష్ట్రాలు, బాలీవుడ్లోనూ భారీగా ప్రమోషన్ చేయబోతున్నారు. చిరంజీవి ఆయా రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్నారు.
ఇప్పటికే సినిమా భారీ బిజినెస్ చేసుకుంది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సురేందర్ రెడ్డి మేకింగ్ ఎలా ఉన్నది అనే విషయం అందరిని టెన్షన్ పెడుతున్నది. సినిమా రన్ టైమ్ ను ఇప్పటికే లాక్ చేశారు. 2 గంటల 45 నిమిషాల రన్ టైమ్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ట్రైలర్, ఆడియోను రిలీజ్ చేస్తారని సమాచారం. టీజర్ రిలీజ్ అయ్యి చాలా రోజులైంది. ఇప్పుడు ఈ సినిమాలోని సింగిల్స్ ను రిలీజ్ చేయాల్సిన సమయం వచ్చింది. మరి వీటిని ఎప్పుడు ఎలా రిలీజ్ చేస్తారో చూడాలి.