'సైరా' సినిమా పై ప్రేమ చూపిన ‘సాహో’ నిర్మాతలు..!
ఈ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రలో చిరంజీవి నటించారు. అయితే ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న రామ్ చరణ్ 'సైరా' సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు అదిరిపోయే రీతిలో ఉండాలని భారీగా ప్లాన్ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా నాలుగు భాషలలో విడుదల కాబోతున్న ఈ సినిమా లో అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, తమన్నా, నయనతార లాంటి ప్రముఖ నటులు నటించడం జరిగింది.
ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఇటీవల 'సాహో' లాంటి భారీ బడ్జెట్ సినిమా తీసిన నిర్మాతలు 'సైరా' సినిమా పై ప్రేమ చూపినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. విషయంలోకి వెళితే సైరా చిత్ర గుంటూరు ఏరియా రైట్స్ రికార్డ్ ధరకు అమ్ముడయ్యాయి. 'సాహో' లాంటి భారీ చిత్రాన్ని నిర్మించిన యూవీ క్రియేషన్స్ సంస్థే సైరా గుంటూరు హక్కులని 11.5 కోట్లకు దక్కించుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఇందుమూలంగా నేమో నెల్లూరు నగరంలో భారీ స్థాయిలో మల్టీప్లెక్స్ సినిమా ధియేటర్ ఓపెనింగ్ కార్యక్రమానికి 'సైరా' సినిమా నిర్మాత రాంచరణ్ వచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వారు.