అనిల్ రావిపూడి తో మహేష్ మరొక సినిమా..?
దీంతో 'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్ సెట్లో ఉన్న సమయంలోనే మహేష్ బాబుకి మరో స్టోరీని అనిల్ రావిపూడి వినిపించాడట. దీంతో వెంటనే ఓకే చెప్పేశాడట మహేష్. ఈ సినిమా అయిన వెంటనే కాకుండా 'సరిలేరు నీకెవ్వరు' సినిమా తర్వాత వేరొక సినిమా చేసి తర్వాత మళ్లీ అనిల్ రావిపూడి తో చేయాలని మహేష్ బాబు డిసైడ్ అయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.
మహేష్ బాబు ఈ సారి ఎలాగైనా అనిల్ రావిపూడి తో ప్రస్తుతం చేస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని హ్యాట్రిక్ కొట్టే ఆలోచనలో ఉన్నాడట. ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు విజయశాంతి నటించడంతో రి ఎంట్రీ ఇవ్వడం తో సినిమాపై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. అయితే ఈ సినిమాలో విజయశాంతి లెక్చరర్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. దిల్ రాజు-అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి మార్కు ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. సంక్రాంతికి హంగామా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.