'సాహో' తీసి నేనేమైనా నేరం చేశానా..అంటున్న దర్శకుడు సుజిత్..?

Kunchala Govind
'సాహో'..దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా. ప్రభాస్-బాలీవుడ్ నటి శ్రద్ద కపూర్ జంటగా నటించారు. ఈ సినిమా రిలీజ్ కు ముందు నెలరోజుల నుండి మొదలైన హంగామా..విడుదలై దాదాపు పది రోజులు అవుతున్నా ఇంకా తగ్గలేదు. బాక్సాఫీసు లెక్కల సంగతి అటుంచితే 'సాహో' ఏదో ఒక అంశంలో చర్చనీయాంశం అవుతోంది. 'సాహో' కు ఆడియన్స్ రెస్పాన్స్ బాగానే ఉన్నా కొందరు కావాలని నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారని.. అసలు ఇలాంటి మాస్ ఎంటర్టైనర్ ను ప్రభాస్ కు ఇచ్చినందుకు బీహార్ లో ప్రేక్షకులు ఒక గుడి కట్టేందుకు కూడా రెడీ అవుతున్నారని సుజిత్ అన్నట్టు రీసెంట్ గా మీడియాలో ఒక వార్త బాగా హల్‌చల్ చేసింది. అంతేకాదు ఈ మ్యాటర్ గురించి తెలుగుతో పాటు మిగతా ఇండస్ట్రీలలోను బాగా మాట్లాడుకున్నారు కూడా.

అయితే ఈ విషయం మీద సుజిత్ స్పందించినట్టుగా ఒక బాలీవుడ్ మ్యాగజైన్ కథనం ప్రచురించింది. అలాంటి వ్యాఖ్యలేమీ చేయలేదని.. అలాంటి కామెంట్స్ ఎప్పుడూ చేయనని సుజిత్ అన్నాడట. అంతే కాదు ఇలాంటి కామెంట్స్ ఎంత సిల్లీగా ఉంటాయో తనకు తెలుసని కూడా మాట్లాడట. ఇక 'సాహో' సంబంధించి తనపై వస్తున్న తీవ్రమైన విమర్శల గురించి మాట్లాడుతూ "నేను ప్రభాస్ సర్...నా నిర్మాతలు ఈ సినిమాను నమ్మి రూపొందించాము. ప్రేక్షకులు భారీ సంఖ్యలో వచ్చి సినిమాను చూశారు. అయినా రిజల్ట్ గురించి పక్కన పెట్టి నేనేదో పెద్ద నేరం చేసినట్టు నన్ను విమర్శిస్తున్నారు" అని సీరీయస్ అయ్యాడట.

అంతే కాదు తను చివరిసారిగా 'సాహో' రిలీజ్ అయిన నెక్స్ట్ డే ఇంటర్వ్యూలు ఇచ్చానని.. ఆ తర్వాత ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వలేదని..అయినప్పటికి ఏదో ఒక రకంగా నా మీద కామెంట్లు చేసినట్టుగా వార్తలు వస్తూనే ఉన్నాయని గోడు వెల్లబెట్టుకున్నాడట. మరి వీటన్నిటిలో ఎంత వరకు నిజముందో తెలియాలంటే సుజిత్ ప్రత్యేకంగా ఒకసారి మీడియాతో అసలు వాస్తవాలు మాట్లాడితే ఈ రూమర్లన్నిటికీ ఫుల్ స్టాప్ పడుతుంది. ఇక ఏదేమైనా సాహో సక్సస్ గురించి పక్కన పెడితే రెండవ సినిమాతోనే సుజిత్ దర్శకుడిగా బాగా పాపులర్ అయ్యాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: