30 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్...!

siri Madhukar
టాలీవుడ్ లో ఏదైనా క్రేజీ కాంబినేషన్ వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా చూస్తుంటారు. అలాంటి క్రేజీ కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయి.  టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్ గా త్రివిక్రమ్-పవన్ కళ్యాన్, త్రివిక్రమ్-అల్లు అర్జున్ అంటారు. ఇక కొరటాల - మహేష్ బాబ్ కాంబినేష్ సూపర్ హిట్ అంటుంటారు.  ఇలా ప్రత్యేకంగా ఇలాంటి కాంబినేషన్ లో వచ్చే సినిమాలకు పబ్లిక్ టాక్ కూడా పాజిటీవ్ గా ఉంటుంది. ఒకప్పుడు కృష్ణ, విజయ శాంతి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఎన్నో సూపర్ హిట్ గా నిలిచాయి.

తాజాగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన జంటగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా వస్తుంది. అయితే ఈ మూవీలో మరో ప్రత్యేకత ఏంటంటే లేడీ అమితాబచ్చన్ విజయశాంతి నటిస్తుంది. చాలా కాలం తర్వాత విజయశాంతి వెండి తెరపై కనిపిచండం ప్రేక్షకుల్లో ఎంతో ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. వాస్తవానికి మహేష్ బాబు, విజయశాంతి కాంబినేషన్ ‘కొడుకు దిద్దిన కాపురం'లో నటించారు.  ఈ మూవీ   1989వ సంవత్సరంలో  వచ్చింది. ఈ మూవీలో మహేష్ బాబు డబుల్ రోల్..మహేష్ తల్లిగా విజయశాంతి నటించారు.   సరిగ్గా 30 ఏళ్ల తర్వాత మహేష్‌బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' మూవీలో కీలక పాత్రను విజయశాంతి పోషిస్తోంది.

సుదీర్ఘ కాలం బ్రేక్‌ తీసుకున్న తర్వాత విజయశాంతి కేవలం మహేష్‌ బాబుపై అభిమానంతో ఈ మూవీలో నటించేందుకు ఒప్పుకుందనే విషయం అందరికి తెల్సిందే. అప్పట్లో మహేష్ కి ఇంత పెద్ద ఎత్తున క్రేజ్ వస్తుందని విజయశాంతి ఉహించి ఉండదు. తాజాగా ఈ విషయాన్ని మహేష్ బాబు తన ట్విట్టర్ లో అభిమానులతో పంచుకున్నారు.  జీవితం అనేది సర్కిల్‌ మాదిరిగా తిరుగుతుందనేందుకు ఇదే సాక్ష్యం అని మహేష్‌ బాబు తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 
It all started here ..⏳
Year - 1989
Location - Sets of Koduku Diddina Kapuram
.
.
30 years later ⌛
.
.
I'm working with @vijayashanthi_m garu once again in #SarileruNeekevvaru... life has come a full circle...😇#throwbackthursday #nostalgia pic.twitter.com/cEjrPhadKr

— Mahesh Babu (@urstrulyMahesh) September 12, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: