మహేష్ ట్విట్ కి విజయశాంతి స్పందన!

siri Madhukar
టాలీవుడ్ కామెడీ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనీల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన జంటగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా వస్తుంది. అయితే ఈ మూవీలో మరో ప్రత్యేకత ఏంటంటే లేడీ అమితాబచ్చన్ విజయశాంతి నటిస్తుంది.  చాలా కాలం తర్వాత విజయశాంతి వెండి తెరపై కనిపిచండం ప్రేక్షకుల్లో ఎంతో ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే మహేష్ బాబు తన తీపి జ్ఞాపకాన్ని ఒకటి ట్విట్టర్ వేధికగా పంచుకున్నాడు.

మహేష్ బాబు, విజయశాంతి కాంబినేషన్ ‘కొడుకు దిద్దిన కాపురం'లో నటించారు.  ఈ మూవీ   1989వ సంవత్సరంలో  వచ్చింది.  సరిగ్గా 30 ఏళ్ల తర్వాత మహేష్‌బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' మూవీలో కీలక పాత్రను విజయశాంతి పోషిస్తోంది. నిన్న మహేష్ బాబు  ‘జీవితం అనేది సర్కిల్‌ మాదిరిగా తిరుగుతుందనేందుకు ఇదే సాక్ష్యం’ అని  ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇక మహేష్ బాబు ట్వీట్ పై విజయశాంతి స్పందించారు.  స్పందించారు. 


 "కాలక్రమంలో ప్రకృతి శక్తుల్లో కూడా మార్పు రావొచ్చేమో కానీ, మన మహేశ్ బాబు స్వభావం అప్పటికీ ఇప్పటికీ ఏం మారలేదు. పాలబుగ్గల పసితనం ఇంకా అలాగే ఉంది. ఆ క్యూట్ నెస్సే అతడికి ఆభరణం. మా ఇద్దరి కాంబినేషన్ 1989లో మొదలైంది. సరిగ్గా 1980లో ఇదే రోజున సూపర్ స్టార్ కృష్ణ గారితో కిలాడీ కృష్ణుడు చిత్రంలో నటించాను" అంటూ ట్వీట్ చేశారు.

గతంలో సూపర్ స్టార్ కృష్ణ, విజయశాంతి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి..మంచి విజయాన్ని అందుకున్నాయి.  మరి చాలా కాలం తర్వాత విజయశాంతి ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించబోతుందో చూడాలి. 
Nature forces years to change, but not the nature of our @urstrulyMahesh Babu garu. Cuteness is his crown in heart n mind. Our combination by 1989 preceded by my entry on this same day in '80 with Kiladi Krishnudu as a pair of all-time Superstar Krishna Garu.

— VijayashanthiOfficial (@vijayashanthi_m) September 12, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: