పెద్ద సినిమాలు
వస్తున్నాయి అంటే చాలు రేట్ల పెంపు అన్నది
మాములైపోయింది. అది
ఏ హీరో సినిమా అయినా?
అంతే. టికెట్ ధరలు పెంచాలనే ఉద్దేశంతో ముందుగానే
ప్లాన్ చేసుకుంటారు. థియేటర్ల వారి వారి లెటర్లు రెడీ చేయడం, కోర్టుల
ద్వారా ఆదేశాలు తెచ్చుకోవడం అంతా సులువుగా జరిగిపోతుంది.
ఏయే థియేటర్లలో ప్రదర్శిస్తామో ముందుగానే నిర్ణయించుకుంటే ఎలాంటి గొడవ
లేకుండా ఉంటుందనేది వారి ఉద్దేశం. టికెట్ల పెంపు విషయంలో ఎవరైన ఎదురు తిరిగినా...తాము
నిబంధనలకు విరుద్దంగానే టికెట్ల రేట్లు పెంచామని, ఇందులో ఎలాంటి అక్రమాలు లేవని చెప్పుకొచ్చేస్తుంటారు.
బాహుబలి ప్రభాస్
సాహో విషయంలో చివరి నిమిషంలో హడావుడి, లేనిపోని తంటాలు తప్పలేదు. కానీ 'సైరా' విషయంలో
అలా కాదు. పక్కాగా ప్లాన్
తో ముందుకెళ్తున్నారు. అందుకే సినిమా విడుదల పదిరోజులు ఉండగానే ఆంధ్రలో టికెట్ రేటుపెంపు కోసం కావాల్సిన వ్యవహారాలు
అన్నీ పూర్తి చేసేశారట. రెండువందల యూనిఫామ్ రేటు ఫిక్స్ అయిపోయింది.
సైరా సినిమాను
తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్ల మేరకు బిజినెస్
చేశారు. సాహో మాదిరి కాదు.
సాహో కేవలం ఈస్ట్ వెస్ట్
మినహా మరే ఏరియా తెలుగు
రాష్ట్రాల్లో అమ్మలేదు. సైరా సినిమా తెలుగు
రాష్ట్రాల్లో 130 కోట్లకు పైగా వసూళ్లు సాధించాలి.
సాహో సినిమా 80 నుంచి 90 కోట్ల రేంజ్ లో
ఉండిపోయింది. మహేష్
బ్లాక్ బస్టర్ మహర్షి ది కూడా దాదాపు
80 కోట్ల రేంజ్ నే. మెగాస్టార్
ఆల్ రౌండర్ రికార్డు ఖైదీ నెంబర్ 150 కూడా
తెలుగులో 80 కోట్ల రేంజ్ లోనే
ఆగింది.
ఇలాంటి నేపథ్యంలో
తెలుగు రాష్ట్రాల్లో 130 కోట్ల మేరకు వసూళ్లు
రావాలంటే సైరా ఫిగర్లు కచ్చితంగా
బాహుబలి 2ని మ్యాచ్ కావాల్సిందే.
వైజాగ్ ను పక్కనపెడితే మిగిలిన
ఏరియాల్లో బాహుబలి 2 రేంజ్ కలెక్షన్లు తెచ్చుకోవాలి.
మెగాస్టార్ కు ఉన్న పాపులారీటే
వేరు. అంతులేని అభిమానుల ఫాలోయింగ్,
మాసివ్ ఓపెనింగ్ కలెక్షన్లు, దసరా సీజన్, సెలవులు
అన్నీకలిసి సైరాను టార్గెట్ రీచ్ అయ్యేలా చేస్తాయని
ట్రేడ్ వర్గాల వినికిడి.