మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ గద్దలకొండ గణేష్ మొన్న విడుదలై పాజిటివ్ రివ్యూస్ ను తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ వద్ద సత్తాచాటుతుంది. మొదటి రోజు ఈచిత్రం తెలుగు రాష్ట్రాల్లో 5.88కోట్ల షేర్ ను రాబట్టి వరుణ్ కెరీర్ లో అత్యుత్తమ ఓపెనింగ్ ను సాధించిన చిత్రం గా రికార్డు సృష్టించింది. ఇక రెండో రోజు కూడా అదే జోరును కొనసాగించిన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.45కోట్ల షేర్ ను రాబట్టిందని సమాచారం. నైజాం లో ఈచిత్రం మొదటి రోజు 1.65కోట్ల షేర్ ను కలెక్ట్ చేయగా రెండో రోజు 1.41 కోట్ల షేర్ తో మొత్తం రెండు రోజుల్లో 3.06కోట్ల షేర్ ను రాబట్టింది. ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద ఇదే జోరును కొనసాగిస్తే వచ్చే వారంలో బ్రేక్ ఈవెన్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు వేరే సినిమాలనుండి పెద్దగా పోటీలేకపోవడం అడ్వాంటేజ్ కానుంది.
కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'జిగర్తండా' కు రీమేక్ గా తెరకెక్కిన ఈచిత్రంలో బాబీ సింహ పాత్రలో వరుణ్ తేజ్ నటించగా సిద్దార్థ్ పాత్రలో తమిళ యువ హీరో అథర్వ మురళి కనిపించాడు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈచిత్రంలో వరుణ్ కు జోడిగా పూజా హెగ్డే అథర్వ కు జోడిగా డబ్ స్మాష్ ఫేమ్ మృణాళిని రవి నటించారు. ఇక వీరితోపాటు హాట్ బ్యూటీ డింపుల్ హయాతి స్పెషల్ సాంగ్ లో మెరిసింది.కాగా అథర్వ , మృణాళిని కి తెలుగులో ఇదే మొదటి చిత్రం.14 రీల్స్ బ్యానర్ ఫై రామ్ ఆచంట , గోపీ ఆచంటనిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు.