నెటిజన్లకు అడ్డంగా బుక్కైన బాలీవుడ్ నటి ‘సోనాక్షి సిన్హా’

సామాన్యంగా సెలబ్రిటీలు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా వహంచాల్సి ఉంటుంది.  ఎంత పెద్ద సెలబ్రిటీలు అయినా…కనీసం జనరల్ నాలెడ్జి తెలిసి  ఉండాలి. లేకపోతే అవనసరంగా చిక్కుల్లో పడిపోతారు. సినిమాలు చేసిన తర్వాత అందరి ముందు పెద్ద పెద్దగా డైలాగులు కొడుతు, గొప్పగా మాట్లాడుతుంటారు. అలాగే సోషల్ మీడియాలో అవసరం లేకున్నా లైవ్ లో వస్తూ తెగ బిల్డప్ ఇస్తుంటారు. నెటిజన్లకు కూడా ఏదో తాము మంచి సలహాలు ఇస్తూ విర్రవీగిపోతుంటారు. కానీ వారు చిన్న తప్పుల్లో చిక్కిన నెటిజన్లు మాత్రం ఓ రేంజ్ లో ఆటాడుకకుంటారు.


అయితే ట్రోల్స్, కామెంట్ల విషయంలో సెలబ్రిటీలే సాఫ్ట్ టార్గెట్‌గా ఉంటారు. ఈ ప్రపంచంలోని వ్యక్తి తప్పులు చేయడం అనేది సాధారణం. ఇంకా అందులో మామూలు వ్యక్తులు తప్పులు చేయడం వేరు…సెలబ్రిటీలు తప్పులు చేయడం వేరు. మనం చేసిన తప్పులు ఎవరు పెద్దగా స్పందించకపోయినా..సెలబ్రిటీలు ఏదైన పొరపాటు చేశారంటే చాలు..ఇంకేముంది ఒక రేంజ్ లో ఆటాడేసుకుంటారు నెటిజన్లు. వారికి ఎప్పుడు ట్రోల్స్ చేస్తుంటారు. అయితే ఇక్కడ మాత్రం ఓ విషయంలో  బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా నెటిజన్లకు అడ్డంగా బుక్కయిపోయింది. కాగా, శుక్రవారం జరిగిన కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో రోజున సెలబ్రిటీ సోనాక్షి పాల్గొన్న విషయం పాఠకులకు తెలిసిందే. ఈ నేపథ్యంలో అమితాబ్ సోనాక్షిని రామాయణానికి సంబంధించిన ఓ ప్రశ్న అడిగారు. ‘రామాయణం ప్రకారం.. హనుమంతుడు ఎవరి కోసం సంజీవని తెచ్చాడు?’ అని అడిగాడు. ఇందుకు ఆప్షన్స్‌గా ఎ. సుగ్రీవుడు, బి. లక్ష్మణుడు సి. సీత, డి.రాముడు అని ఇచ్చారు అమితాబ్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం లక్ష్మణుడు. కానీ సోనాక్షి దీనికి కూడా లైఫ్ లైన్ తీసుకుంది. అయినప్పటికీ సరైన జవాబు చెప్పలేకపోయారు సోనాక్షి. ఇంకేముంది ఆమెను నెటిజన్లు ఒక రేంజ్ లో ఆటాడేసుకున్నారు. ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. ఎందుకంటే సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా తన ఇంటికి రామాయణ అని పేరు పెట్టుకున్నారు. అంతేకాదు తన ఇద్దరు కుమారులకు సీతారాముల కుమారులైన లవకుశల పేర్లు పెట్టుకున్నారు. అయితే రాముడిని అంతగా ఆరాధించే ఫ్యామిలీ నుంచి వచ్చిన సోనాక్షి రామాయణానికి సంబంధించిన ఈ చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడం ఏమిటని, నెటిజన్లు సోషల్ మీడియాలో వారి వారి కామెంట్లతో దుమ్ములేపేశారు.


అంతేకాదండోయ్… ఆమె  పేరిట హ్యాష్ ట్యాగ్‌ను జాత చేసి మరీ ఘోరంగా ట్రోల్ చేశారు. దీనిపై తాజాగా నటి సోనాక్షి ట్విటర్ వేదికగా స్పందించారు. ‘డియర్ ట్రోల్స్.. నాకు పైథాగరస్ థియరం, మర్చెంట్ ఆఫ్ వెనిస్, పీరియాడిక్ టేబుల్, క్రోనోలజీ ఆఫ్ ది మొఘల్ డైనాస్టీ వంటి విషయాల గురించి కూడా ఏమీ తెలియవు. కాబట్టి ప్లీజ్.. మీకు వేరే పని లేకపోయినా, లేదా మీరు ఖాళీగా ఉన్నా.. వీటిని ఉద్దేశిస్తూ కూడా నన్ను ట్రోల్ చేసి మీమ్స్ రూపొందించండి. ఎందుకంటే నాకు మీమ్స్ అంటే చాలా ఇష్టం’అంటూ తనదైన స్టైల్లో నెటిజన్లకు చురకలు అంటించారు. సోనాక్షి మాత్రమే కాదండోయ్.. బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ కు కూడా ఆలియా భట్ కూడా జనరరల్ నాలెడ్జ్ లో చాలా పూర్. మన రాష్ట్రపతి ఎవరు అని అడిగినప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ అని చెప్పడంతో , అసలు ఆమెకు కొద్దిగానైనా దిమాక్ లేదంటూ ఊడ్చిపారేశారు నెటిజన్లు. అసలు సెలబ్రిటీలు నెటిజన్లకు ఇలాంటప్పుడే దొరికేది . అందుకే సెలబ్రిటీలు అన్ని విషయాల్లో ఆచీ తూచి వేయాల్సి ఉంటుంది.






T 40 - .@ShatruganSinha @SrBachchan @sonakshisinha @KBCsony #KBCKaramveer #KBC11 #sonakshisinha you are trending 1 on twitter,
Now watch this video to know why #YoSonakshiSoDumb is trending. pic.twitter.com/6jNMb1U9CP

— Nitesh Yadav NTS ❁ (@iAmNTS) September 21, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: