తెలుగులో సక్సెస్ ఫుల్ గా ప్రసారమవుతున్నబిగ్బాస్ 3 రియాలిటీ షో. రెండు సీజన్లు పూర్తి చేసుకుని మూడో సీజన్ కింగ్ నాగార్జున హోస్టుగా నిర్వహిస్తున్నారు.అయితే దాదాపు 60 రోజులుకుపైగా పూర్తి చేసుకున్న బిగ్బాస్ షో...ఈ రోజు జరిగిన షో, స్టేజ్ పైకి రచ్చ చేసేందుకు గద్దలకొండ గణేష్ వచ్చాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లెటెస్టు మూవీ గద్దలకొండ గణేష్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ బిగ్ బాస్ స్టేజ్ పైకి ఎక్కేశాడు. అలా వస్తూనే హౌస్ మేట్స్ కు “మనం హౌస్ లో ఉన్నామని నలుగురికి తెలీకపోతే ఇక హౌస్ లో ఉండుడు ఎందుకురా” అని తనదైన డైలాగ్ తో ఇంటి సభ్యులందరిని మెగా వరుణ్ తేజ్ ఆకట్టుకున్నాడు. అంతే కాదు కంటెస్టంట్ అందరూ కూడా వరుణ్ను ప్రపోజ్ చేసే టాస్క్ లో శ్రీముఖి, హిమజలు విషయం పక్కన పెడితే పునర్నవిని మాత్రం గద్దలకొండ గణేష్ ఇరకాటంలో పడేసింది. ఎందుకంటే ప్రపోజ్ చేయ్యడానికి పునర్నవి రెడీ అవుతుండగా, పునర్నవికి చేతులు వణకడంతో వరుణ్తేజ్కు ప్రపోస్ చేయలేకపోతోంది. నువ్వు నాకు ప్రపోజ్ చేయలేకపోతున్నావంటే మరెక్కడో చెప్పేసి ఉంటావు అంటూ...గద్దలకొండ గణేష్ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.
చివరకు ఎలిమినేషన్ టైమొచ్చిందని, ఎలిమినేషన్ లో ఉన్న ఇద్దరైన పునర్నవి, మహేష్ విట్టా ఉండగా, వారిలో ఒకరు ఎలిమినేషన్ కాబోతున్నారని, అయితే ఇద్దరిలో ఎవరో పేరు చెప్పేయాలని నాగ్ వరుణ్ను అడుగగా, అందుకు వరుణ్ నేను జేబులో చిట్టి రాసుకుని వచ్చానని, తీసి చదువుతానని, హిమజ ఎలిమినేషన్ అయిందని చెప్పేశాడు. ఇంకేముంది ఒప్పో సెల్ఫీ దిగి స్టేజిపైకి రావాలని నాగ్ చెప్పాడు. వెంటనే స్టేజిపైకి వచ్చిన తర్వాత హౌస్లో ఎవరు మంచి వారు, ఎవరు మంచివారు కాదని చెప్పమన్నాడు నాగార్జున.ఇక హిజకు ఎవరు ఎలాంటి వారు బోర్డు చూపిస్తూ చెప్పేసింది. మొత్తం మీద నాగార్జునతో ఇలా జరిగింది ఈ బిగ్బాస్ షో.