మొదటి సినిమాతోనే టాప్ లెస్ గా కనిపించి షాక్ ఇచ్చిన హీరోయిన్
నూతన దర్శకుడు అనిల్ పడూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ , ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మందిరా బేడీ , మకరంద్ దేశ్ పాండే ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క మూడో షెడ్యూల్ నేటి నుండి హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. యూత్ ను టార్గెట్ చేస్తూ రూపొందుతున్న ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.
ఇక ఆకాష్ పూరి తో పూరి జగన్నాథ్ 'మెహబూబా' అనే చిత్రాన్ని తెరకెక్కించగా గత ఏడాది విడుదలైన ఈచిత్రం డిజాస్టర్ అయ్యింది. అయితే ఆకాష్ నటన కు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇప్పుడు 'రొమాంటిక్' తో ఎలాగైనా తన కొడుకుకు మొదటి హిట్ ఇవ్వాలని పట్టుదలతో వున్నాడట పూరి. ఇదిలావుంటే వరుస పరాజయాలతో సతమతమైన పూరి ఇటీవల ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయ్యాడు.