తెలుగులో వస్తున్న ‘జబర్ధస్త్’ కామెడీ షో అంటే ఇష్టపడని వారు ఉండరు. ఆరేళ్లు దాటిని ‘జబర్ధస్త్’ కి ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు. ‘జబర్ధస్త్’ ఇప్పటి వరకు ఎంతో మంది కమెడియన్లు వచ్చారు..పోయారు. అదిరే అభి ద్వారా ‘జబర్ధస్త్’ కి పరిచయం అయిన హైపర్ ఆది అతి తక్కువ కాలంలోనే సొంతగా టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు. ‘జబర్ధస్త్’ హైపర్ ఆది వేసే పంచులకు కడుపుబ్బా నవ్వుకుంటారు.
హైపర్ ఆది టీమ్ లో రేజింగ్ రాజు, దొరబాబు, శాంతిస్వరూప్ లు చేసే కామెడీ కి ఎంతో జనాదరణ లభిస్తుంది. ‘జబర్ధస్త్’ బాగా పాపులర్ అయిన వారు ప్రస్తుతం వెండి తెరపై అలరిస్తున్న విషయం తెలిసిందే. ధన్ రాజ్, వేణు, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, గెటప్ శీను ఇలా చాలా మంది వెండి తెరపై కమెడియన్లుగా రాణిస్తున్నారు. ‘జబర్ధస్త్’ ద్వారా బాగా క్రేజ్ తెచ్చుకున్న షకలక శంకర్ అయితే ఇప్పటికీ మూడు సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. ఈ మద్య సుడిగాలి సుధీర్ కూడా సాఫ్టెర్ సుధీర్ మూవీతో హీరోగా మారారు.
ఇక హైపర్ ఆది సైతం సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. మేడమీద అబ్బాయి సినిమాకు డైలాగ్స్ కూడా రాశాడు. పవన్ కళ్యాన్ వీరాభిమాని అయిన హైపర్ ఆది ఆ మద్య ఎన్నికల సమయంలో ఆయనకు మద్దతు పలికారు. అయితే హైపర్ ఆది ఈ మద్య తన కామెడీ పంచ్ ల్లో ఎక్కువగా వ్యంగ్యం ఉంటుందని ఆరోపణలు వస్తున్నాయి. గత వారం హైపర్ ఆది గద్దలకొండ గణేష్ గెటప్ లో స్కిట్ చేశాడు. అతడి భార్యగా రోహిణి, మరదలిగా శాంతిస్వరూప్ చేశారు. ఈ సదర్భంగా శాంతి స్వరూప్ నన్ను రాఘవేంద్రరావు చూస్తే ఉంటే పండులతో కొట్టేవారు అని అంటాడు.
వెంటనే ఆది నువ్వేమైనా పండులతో, పావులతో కొట్టడానికి నువ్వేమైనా రోజా గారివా అంటూ సెటైర్ వేస్తాడు. ఆది చూసి నటి, ఎమ్మెల్యే రోజా కాస్త ముఖం తిప్పుకుంది. వెంటనే ఆ డైలాగ్ కవర్ చేసుకోవడానికి ఆది ఆమె అంటే అందెగత్తె కాబట్టి అలా చేస్తారు..నువ్వు కాదుకదా అంటూ ఏదో కవరింగ్ చేశాడు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన ఆమెపై ఇలాంటి పనికిమాలిన సెటైర్లు వేయడం నిజంగా హైపర్ ఆది పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. హైపర్ ఆదికి కామెడీకి, అపహాస్యానికి తేడా తెలియదా అంటూ విరుచుకుపడుతున్నారు.